అమిత్ షా ఆగడాలు పోవాలంటే.. కెసిఆర్ జాతీయ రాజకీయాల్లోకి రావాలి – ఎంపీ మాలోవత్ కవిత

-

అమిత్ షా ఆగడాలు దేశం నుండి పోవాలంటే.. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ రాజకీయాలలోకి రావాలని అన్నారు ఎంపీ మాలోవత్ కవిత. కేంద్ర ప్రభుత్వం దర్యాప్తు సంస్థలతో రాష్ట్రాలను భయభ్రాంతులకు గురిచేస్తోందని మండిపడ్డారు. కెసిఆర్ జాతీయ పార్టీ పెట్టాలని.. దేశ ప్రజలు కేసీఆర్ కోసం ఎదురు చూస్తున్నారని అన్నారు ఎంపీ కవిత.

అలాగే బడుగుల లింగయ్య యాదవ్ మాట్లాడుతూ.. ఈ దేశానికి కెసిఆర్ ఒక్కరే శరణ్యం అన్నారు. బిజెపి రాష్ట్రాల హక్కులను హరిస్తోందని, అందుకే కెసిఆర్ కొత్త పార్టీ పెట్టాలని అందరూ ఎదురు చూస్తున్నారని అన్నారు. కెసిఆర్ మాట్లాడే ప్రతి మాటను దేశ ప్రజలు నమ్ముతున్నారని అన్నారు బడుగుల లింగయ్య యాదవ్. మరోవైపు ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ మాట్లాడుతూ.. దేశంలో బిజెపిని బొంద పెట్టాలని మండిపడ్డారు. భారతదేశానికి మరోసారి స్వాతంత్ర్యం అందించాలని ప్రజలు అందరూ కోరుకుంటున్నారని అన్నారు ఎమ్మెల్యే మెతుకు ఆనంద్.

Read more RELATED
Recommended to you

Exit mobile version