నిమర్జనాన్ని అడ్డుకుంటే ప్రగతిభవన్ లో నిమర్జనం చేస్తాం – బండి సంజయ్

-

ఖైరతాబాద్ మహాగణపతి దర్శించుకున్నారు బిజెపి రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి తరుణ్ చుగ్. ఖైరతాబాద్ మహాగణపతికి 20 కేజీల లడ్డును సమర్పించారు. అనంతరం తరుణ్ చుగ్ తో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ.. దశాబ్దాలుగా మహాగణపతిని ప్రతిష్టిస్తూ ధార్మిక వాతావరణం నెలకొల్పేలా ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్న నిర్వాహకులకు అభినందనలు తెలిపారు. హిందూ సమాజం చీలిపోతే తెలంగాణకు ప్రమాదకర పరిస్థితులు సంభవిస్తాయని హెచ్చరించారు.

బండి సంజయ్
బండి సంజయ్

ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న పరిణామాలను బేరీజు వేసుకుంటే హిందువులంతా సంఘటితం కావలసిన సమయం ఆసన్నమైందన్నారు. ఒక వర్గం ఓట్ల కోసమే టిఆర్ఎస్ సర్కారు ప్రయత్నాలు చేస్తోందని మండిపడ్డారు. నిబంధనల పేరుతో నిమజ్జనాన్ని అడ్డుకుంటుందని బండి సంజయ్ ఆరోపించారు. నిమర్జనాన్ని అడ్డుకుంటే ప్రగతిభవన్లో నిమజ్జనం చేస్తామని బండి సంజయ్ హెచ్చరించారు.

Read more RELATED
Recommended to you

Latest news