కరెంట్ బిల్లు తక్కువ రావాలంటే ఈ టిప్స్ ను ఫాలో అవ్వాల్సిందే..!!

-

ఈ మధ్య కాలంలో ప్రతి వస్తువు పై ధరలు భారీగా పెరిగిన సంగతి తెలిసిందే..అంతేకాదు విద్యుత్ చార్జీలు కూడా భారీగా పెరిగిన సంగతి తెలుసు..తక్కువ యూనిట్ ల కరెంట్ ను మనం వినియోగించినా కూడా చార్జీల మోత మోగిపోయింది.. పెరుగుతున్న కరెంటు బిల్లులు వినియోగదారులను ఆందోళనకు గురిచేస్తోందన్న విషయం తెలిసిందే. ప్రజలు కరెంటు బిల్లుల షాక్‌ను తట్టుకోలేకపోతున్నారు. విద్యుత్ ధరలు పెరగడం, వినియోగం ఎక్కువ కావడంతో బిల్లు భారీగా వస్తోంది.

విద్యుత్ ఛార్జీలను తగ్గించడం మీ చేతుల్లో లేదు కాని, కరెంటును సక్రమంగా వాడుకోవడం ద్వారా పెరుగుతున్న వ్యయాన్ని సులభంగా నియంత్రించుకోవచ్చు. పొదుపు కోసం సరైన మార్గంలో విద్యుత్తును ఉపయోగించడం వల్ల బిల్లులో కొంత ఉపశమనం పొందవచ్చు. అందుకోసం చిన్న మార్పులు చేస్తే చాలు. ఏసీలు, కూలర్‌లు, హీటర్స్ దాదాపు 80 శాతం కరెంటును వినియోగిస్తాయన్నది తెలిసిందే.
మీ ఇళ్లల్లో లేదా కార్యాలయాలలో పాత బల్బులు, ట్యూబ్ లైట్లను ఉపయోగిస్తుంటే, వాటిని వెంటనే తీసేసి బదులుగా LED లైట్లను ఉపయోగించడం ప్రారంభించండి. ఎందుకంటే అవి మీకు సాధారణ బల్బు కంటే ఎక్కువ కాంతిని ఇవ్వడమే కాదు.. విద్యుత్ వినియోగాన్ని కూడా తగ్గిస్తాయి. మీరు ఏసీని వినియోగిస్తున్నట్లయితే.. దాన్ని మరీ తక్కువ లేదా చాలా ఎక్కువ టెంపరేచర్‌లో పెట్టొద్దు. మధ్యస్తంగా పెట్టండి. ఈ విషయాలను మీరు తప్పక తెలుసుకోవాలి..

ఇంటిలో నీటి కోసం గీజర్ లేదా హీటర్‌ని ఉపయోగిస్తుంటే, ఉపయోగించిన తర్వాత దాన్ని వెంటనే ఆఫ్ చేయండి. ఎందుకంటే అలాంటి పరికరాలు అత్యధిక విద్యుత్తును వినియోగిస్తాయి. ఇప్పుడు చలికాలం కూడా వచ్చింది కాబట్టి, పలువురు రూమ్ హీటర్స్ వినియోగిస్తారు. వాటి ఉష్ణోగ్రతను ఎల్లప్పుడూ తక్కువగా ఉంచండి, అలాగే వినియోగించిన వెంటనే వాటిని ఆఫ్ చేయడం మర్చిపోవద్దు.

అదే సమయంలో, వాషింగ్ మెషిన్‌లో దాని సామర్థ్యం మేరకు బట్టలు వేయండి..ఇక పోతే టీవీ, కంప్యూటర్స్ ను కూడా పని అవ్వగానే ఆఫ్ చెయ్యండి..మరీ ఎక్కువ బిల్లు వస్తుంది అనుకుంటే మాత్రం సోలార్ ప్యానెల్స్ మీ విద్యుత్ బిల్లును సగానికి తగ్గిస్తాయి. వాటి ధర ఎక్కువగా ఉన్నప్పటికీ, ఉపయోగిస్తే మాత్రం విద్యుత్ వినియోగాన్ని తగ్గిస్తుంది..అంతేకాదు సాకెట్ లను అమర్చితే మంచిది..ఇలా కొన్ని ఫాలో అయితే మీ బిల్లు సగానికిపైగా తగ్గి పోతుంది..

Read more RELATED
Recommended to you

Latest news