చీకట్లో దొంగ దెబ్బ ఎందుకు..ప్యాలస్ పిల్లి – నారా లోకేష్‌

-

 

చీకట్లో దొంగ దెబ్బ ఎందుకు..ప్యాలస్ పిల్లి అంటూ ఏపీ సీఎం జగన్‌ పై ఫైర్‌ అయ్యారు టీడీపీ నేత నారా లోకేష్‌. ప్రతిపక్ష నేత చంద్రబాబు గారి కాన్వాయ్ పై వైసీపీ రౌడీ మూకల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాను. చీకట్లో రాళ్ళ దాడి చేసే దుస్థితికి దిగజారిపోయాడు ప్యాలస్ పిల్లి జగన్ రెడ్డి అని నిప్పులు చెరిగాడు.

చీకట్లో దొంగ దెబ్బ ఎందుకు, దమ్ముంటే మా ముందుకు వచ్చి నిలబడు ప్యాలస్ పిల్లి.. తేల్చుకుందాం. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపించాలి. దాడికి పాల్పడిన వైసిపి రౌడీలని శిక్షించాలి. దాడిలో గాయపడిన సిఎస్ఓ మధు గారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నానన్నారు లోకేష్‌.

మంగళగిరి నియోజకవర్గంలో సీఎం ఇంటి పక్కన పేదల ఇళ్లు కూల్చడంతో మొదలైన విధ్వంసం ఇంకా కొనసాగుతూనే ఉంది. రాజకీయ కక్ష సాధింపులో భాగంగా ఇళ్లు కూల్చడం ఎమ్మెల్యే ఆర్కేకి వ్యసనంగా మారిపోయిందని మరో ట్వీట్‌ లో పేర్కొన్నారు లోకేష్‌.

Read more RELATED
Recommended to you

Latest news