తెలంగాణకు వర్షసూచన.. పలు జిల్లాలకు ఆరెంజ్‌ అలర్ట్

-

ఓవైపు ఎండలు మండుతున్నాయి. ఉదయం 10 దాటితే బయటకు రావాలంటే ప్రజలు జంకుతున్నారు. ఉక్కపోతతో విలవిలలాడుతున్నారు. భానుడి భగభగలకు అల్లాడిపోతున్న ప్రజలకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం చల్లని కబురు చెప్పింది. తెలంగాణలో పలు జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్‌ అలర్ట్‌ జారీ చేసింది. ఆయా జిల్లాల్లో వడగండ్ల వర్షం కురిసే అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.

రాష్ట్రంలోని ఉమ్మడి ఆదిలాబాద్‌, నిజామాబాద్‌, మెదక్‌, సంగారెడ్డి, వికారాబాద్‌, మహబూబ్‌నగర్‌, నారాయణపేట జిల్లాలకు హైదరాబాద్‌ వాతావరణ శాఖ అధికారులు ఆరెంజ్‌ అలర్ట్‌ జారీ చేశారు. పలు ప్రాంతాల్లో వడగండ్ల వానలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వాతావరణ శాఖ అలర్ట్ తో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంట చేతికొచ్చే సమయాన వరణుడు తమను భయపెడుతున్నాడని వాపోతున్నారు. అకాల వర్షాలు తమ కష్టాన్ని నీటిపాలు చేస్తాయేమోనని ఆందోళన చెందుతున్నారు. ఇక వడగండ్ల వల్ల నష్టపోతామని మామిడి, నిమ్మ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news