విజయవాడలో రూ. 20లకే..కడుపు నిండా భోజనం..ఎప్పుడెళ్లినా..

-

విజయవాడ లాంటి నగరాల్లో బయట కడపునిండా తినాలంటే కనీసం వంద రూపాయలు కావాల్సిందే.. రెండు ఇడ్లీలే రూ. 30పైనే ఉంటాయి. ఈ నగరంలో కేవలం రూ.20కే కడుపు నిండా అన్నం పెట్టే భోజనశాల ఉంది. ఇద్దరు దాతలు కలిసి ఈశ్వర్‌ ఛారిటీస్‌ పేరుతో ఏర్పాటు చేశారు. ఒక్కో ప్లేట్‌ భోజనానికి వారికి రూ.60 ఖర్చవుతోంది. రకరకాల పోటీ పరీక్షల కోసం విజయవాడలో ఉంటున్న యువత, పలు రకాల పనులపై వచ్చే గ్రామీణ ప్రాంత ప్రజలు, ఉద్యోగులకు ఈ భోజనశాల ఆకలి తీరుస్తోంది.
శిఖామణి సెంటర్‌ ఆసుపత్రులు, విద్యా సంస్థలు, ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలతో ఎప్పుడూ రద్దీగా ఉండే ప్రాంతం. సేవాభావంతో ఉన్న ఐదుగురు ఉద్యోగులను ఏర్పాటు చేసుకున్నారు. ఒక దాతకు సంబంధించిన సోదరి ఈ భోజనశాల నిర్వహణ మొత్తం చూసుకుంటారు.. రోజు మధ్యాహ్నం 12 గంటల నుంచి 3 గంటల వరకు తెరిచి ఉంటుంది. ఉదయం 8 నుంచి ఆహారం అంతా సిద్ధం చేస్తారు. ఈ భోజనశాల వద్ద కనీసం రూ.20కే భోజనం అనే బోర్డు కూడా ఉండదు. ఏ సమయంలో వచ్చినా.. ఆహారం వేడివేడిగానే వడ్డిస్తుండడం వీరి స్పెషల్..
ప్రధానంగా రెండు మూడు కూరగాయలతో కూడిన కూర, ఒక కప్పు నిండా అరకిలో అన్నం, సాంబారు, మజ్జిగ ఇస్తారు.. వీటితో పాటు రోజూ తప్పకుండా ఏదో ఒకరకం రోటి పచ్చడి ఉంటుంది. వాము కలిపిన పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు కూడా ఇస్తున్నారు. .
ఈ భోజనశాలలో పనిచేసే వారి దగ్గర నుంచి వినియోగించే వస్తువుల వరకు అన్నింటినీ హైజనిక్‌గా చేస్తారు.. ప్రధానంగా ప్లేట్‌లో అన్నం వడ్డించే ముందు వేడి నీటిలో కడిగి పెడుతున్నారు. దీనికోసం ప్రత్యేకంగా ఒక పరికరం కూడా కొనుగోలు చేసి ఉంచారు. అలాగే నిత్యం రోటి పచ్చడి చేయడానికి.. పాత పద్ధతిలోనే రోలు కూడా ఉంది. వడ్డించేటప్పుడు ఉద్యోగులు కూడా చేతులకు గ్లౌజులు తొడుక్కుంటారు. ఈ రోజుల్లో.. పప్పు నుంచి ఉప్పు వరకూ అన్నీ…రేట్లు పెరిగాయి.

Read more RELATED
Recommended to you

Latest news