IND VS AUS : మూడో టెస్టు వేదిక మారింది.. ఎక్కడంటే?

-

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా నాగపూర్ వేదికగా ఇండియా – ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగిన మొదటి టెస్ట్ మ్యాచ్ లో భారత జట్టు భారీ విజయాన్ని సాధించింది. ఆస్ట్రేలియాపై ఇన్నింగ్స్ 132 పరుగులు తేడాతో టీమిండియా గ్రాండ్ విక్టరీ సాధించింది. మొదటి మ్యాచ్ లో భారత్ స్పిన్నర్లు మాయాజాలం సృష్టించారు.

అయితే, బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా మార్చి 1-5 మధ్య జరగనున్న మూడో టెస్ట్ వేదికను మారుస్తున్నట్లు బీసీసీఐ ప్రకటించింది. హిమాచల్ ప్రదేశ్ లోని ధర్మశాలలో జరగాల్సిన ఈ మ్యాచ్ ను ఆంధ్రప్రదేశ్ లోని ఇండోర్ లో నిర్వహించనున్నట్లు స్పష్టం చేసింది. చలి విపరీతంగా ఉండటం, మైదానం అవుట్ ఫీల్డ్ లో పచ్చిక తక్కువగా ఉండడం వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. మిగతా టెస్టుల వేదికలో ఎలాంటి మార్పు లేదని స్పష్టం చేసింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version