ఇండియాలో కొత్తగా 7554 కరోనా కేసులు, 649 మరణాలు నమోదు

-

ఇండియాలో కరోనా థర్డ్‌ వేవ్‌ తగ్గుముఖం పట్టింది. ఇక తాజాగా కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్‌ బులిటెన్‌ ప్రకారం.. గడిచిన 24 గంటల్లో దేశంలో 7554 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో దేశం లో మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,29,38,599 కు చేరింది.ఇక దేశంలో యా క్టివ్ కరోనా కేసుల సంఖ్య 85,680 కు చేరింది. ఇక దేశం లో కరోనా పాజిటివిటి రేటు 96.62 శాతంగా ఉంది.

ఇక దేశంలో తాజాగా 649 మంది కరోనా తో మరణించ గా మృతుల సంఖ్య 5,14,246 కి చేరింది. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 14123 మంది కరోనా నుంచి కోలు కున్నారు. ఇక దేశ వ్యా ప్తంగా ఆ రికవరీ ల సంఖ్య 4,23,38,673 కు చేరింది. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 1,77,79,92,977 మందికి కరోనా వ్యాక్సిన్లు చేసింది కేంద్ర ఆరోగ్య శాఖ. ఇక గడిచిన 24 గంటల్లో 8,55,862 మందికి కరోనా వ్యాక్సిన్లు వేసింది ఆరోగ్య శాఖ.

Read more RELATED
Recommended to you

Latest news