ఇండియాలో కొత్తగా 10,229 కరోనా కేసులు..523 రోజుల తర్వాత ఇదే తొలిసారి !

-

చైనాలో పురుడుపోసుకున్న కరోనా మహమ్మారి మనదేశంలో లోనూ విజృంభిస్తున్న తెలుస్తుంది. అయితే మన దేశంలో గతంలో కంటే.. ప్రస్తుతం కరోనా మహమ్మారి చాలా తక్కువగా నమోదు అవుతున్నాయి. నిన్నటి కంటే ఇవాళ మరింత తగ్గి పోయాయి కరోనా కేసులు. తాజాగా కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్ ప్రకారం… గడిచిన 24 గంటల్లో దేశంలో 10,229 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

దీంతో దేశం లో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,44,47,536 కు చేరింది. ఇక దేశంలో యా క్టివ్ కరోనా కేసుల సంఖ్య 1,34,096 కు చేరింది. యాక్టివ్ కేసుల సంఖ్య ఇంత తక్కువగా నమోదు కావడం 523 రోజుల తర్వాత ఇదే మొదటి సారి.

ఇక దేశం లో కరోనా పాజిటివిటి రేటు 98.26 శాతంగా ఉంది. ఇక దేశంలో తాజాగా 125 మంది కరోనా తో మరణించ గా మృతుల సంఖ్య 4,63,655 కి చేరింది. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 11,926 మంది కరోనా నుంచి కోలు కున్నారు. ఇక దేశ వ్యా ప్తంగా ఆ రికవరీ ల సంఖ్య 3,38,49,785 కు చేరింది. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 1,12,34,30,478 మందికి కరోనా వ్యాక్సిన్లు చేసింది కేంద్ర ఆరోగ్య శాఖ.

Read more RELATED
Recommended to you

Latest news