Asia Cup 2022 : పాక్ పై పగ తీర్చుకున్న ఇండియా

-

ఆసియా కప్‌ 2022 లో టీమిండియా శుభారంభం చేసింది. చివరి వరకు ఉత్కంఠంగా సాగిన మ్యాచ్‌ లో టీమిండియా.. 5 వికెట్ల తేడాతో పాక్‌ పై గెలిచింది. మొదట పాకిస్తాన్‌ 19.5 ఓవర్లలో 147 పరుగుల వద్ద ఆలౌట్‌ కాగా.. ఇండియా ఆ లక్ష్యాన్ని 5 వికెట్ల తేడాతో ఛేదించింది.

పాక్‌ బ్యాటర్లలో ఓపెనర్‌ రిజ్వాన్‌ 43 పరుగులు చేసి.. రాణించాగారు. ఇక టీమిండియా బౌలర్లలో భువనేశ్వర్‌ 26 పరుగులు ఇచ్చి ఏకంగా 4 వికెట్లు పడగొట్టాడు. అటు పాండ్యా 25 పరుగులు ఇచ్చి.. 3 వికెట్లు తీసి.. పాక్‌ కు చుక్కలు చూపించారు.

తర్వాత లక్ష్య ఛేదనకు దిగిన టీమిండియా 19.4 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 148 పరుగులు చేసి విజయం సాధించింది. కోహ్లీ 35 పరుగులు చేయగా.. పాండ్యా 17 బంతుల్లో 33 పరుగులు చేశాడు. జడేజా 29 బంతుల్లో 35 పరుగులు చేసి… టీమిండియాకు విక్టరీ ని అందించారు. ఇక ఈ మ్యాచ్‌ లో పాండ్యాకు ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డు దక్కింది.

Read more RELATED
Recommended to you

Latest news