ఇవాళ పెద్దపల్లి జిల్లాలో కేసీఆర్ పర్యటన

-

ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు పెద్దపల్లి జిల్లాలో పర్యటించనున్నారు. హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గాన కరీంనగర్ బైపాస్ మీదుగా భారీ ర్యాలీగా వెళ్లనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు సీఎం పెద్దపల్లికి చేరుకోనున్నారు. ముందుగా పెద్దపల్లి శివారులోని పెద్దబొంకూరు వద్ద 22 ఎకరాల్లో 48 కోట్లతో నిర్మించిన సమీకృత కార్యాలయాల సముదాయాన్ని సీఎం ప్రారంభించనున్నారు. కార్యాలయంలోనే ప్రత్యేక పూజలు చేయనున్నారు.

అనంతరం మంథని రోడ్డులో నిర్మించిన తెరాస కార్యాలయాన్ని ప్రారంభిస్తారు. అధునాతన సౌకర్యాలతో కొత్త కలెక్టరేట్‌ భవనాన్ని ఏర్పాటు చేయగా.. 32శాఖలు, 600 మంది ఉద్యోగులు ఏకకాలంలో విధులు నిర్వహించేలా తీర్చిదిద్దారు.

ప్రారంభోత్సవాల అనంతరం కలెక్టరేట్ సముదాయం ఎదురుగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం ప్రసంగించనున్నారు. బహిరంగ సభ కోసం ప్రత్యేకంగా 130 ఎకరాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. సభకు లక్షమంది జనసమీకరణే లక్ష్యంగా మంత్రులు గంగుల కమలాకర్‌, కొప్పుల ఈశ్వర్‌ ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. భారీగా జనం తరలిరానుండడంతో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకున్నామని మంత్రి తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news