నన్ను ఏమైనా అనండి.. కానీ, నా ఫ్యామిలీ జోలికొస్తే.. : ఎలాన్‌ మస్క్‌

-

‘‘నిరంతరం నన్ను విమర్శించడం వరకు ఫర్వాలేదు. నా నిరంతర కదలికల్ని తెలుసుకుంటూ వాటిని బహిర్గతం చేసి నా కుటుంబానికి ముప్పు తెచ్చిపెట్టడం ఏ మాత్రం సరికాదు’’ అని ట్విటర్ అధినేత ఎలాన్ మస్క్‌ ట్వీట్‌ చేశారు.  ట్విటర్‌ గురువారం రోజున పలువురు జర్నలిస్టుల ఖాతాలను తాత్కాలికంగా సస్పెండ్‌ చేసింది. అమెరికాలో ప్రధాన పత్రికలైన న్యూయార్క్‌ టైమ్స్‌, వాషింగ్టన్‌ పోస్ట్‌కు చెందిన పాత్రికేయులు కూడా ఈ జాబితాలో ఉన్నారు. దీనికి కారణాన్ని మాత్రం ట్విటర్‌ ప్రత్యేకంగా వెల్లడించలేదు.

ఇటీవలి కాలంలో ట్విటర్‌ అధిపతి ఎలాన్‌ మస్క్‌ తో పాటు సామాజిక మాధ్యమంలో చేస్తున్న మార్పులపై వీరు కథనాలు రాశారు. ఈ పరిణామాలపై మరోవైపు ఎలాన్‌ మస్క్‌ ట్విటర్‌లో స్పందించారు. ‘‘అందరికీ వర్తించే డాక్సింగ్‌ నిబంధనలే పాత్రికేయులకూ వర్తిస్తాయి’’ అని అన్నారు.

యూజర్ల వ్యక్తిగత వివరాలను పంచుకోవడాన్ని నిషేధిస్తూ ట్విటర్‌ నిబంధనలు రూపొందించింది. వీటినే డాక్సింగ్‌ రూల్స్‌గా వ్యవహరిస్తున్నారు. వీటిపై ఏడు రోజుల వరకు ఈ సస్పెన్షన్‌ కొనసాగుతందన్నారు. అయితే, ట్విటర్‌ మాత్రం ఖాతాలను సస్పెండ్‌ చేయడంపై ఇప్పటి వరకు అధికారికంగా స్పందించలేదు.

వాక్‌ స్వాతంత్య్రాన్ని రక్షించడానికే తాను ట్విటర్‌ను కొనుగోలు చేశానని మస్క్‌ పలు సందర్భాల్లో చెప్పిన విషయం తెలిసిందే. అన్ని అంశాలపై స్వేచ్ఛాయుత చర్చ జరగాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. దానికి ట్విటర్‌ను సరైన వేదికగా నిలబెట్టడానికి కృషి చేస్తున్నామని అన్నారు. ఈ క్రమంలో పూర్వ ట్విటర్‌ యాజమాన్యం రద్దు చేసిన ఖాతాలను పునరుద్ధరించారు. ఈ నేపథ్యంలో ఆయనపై విమర్శలు చేసిన పలువురు జర్నలిస్టుల ఖాతాలను తాజాగా సస్పెండ్‌ చేయడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.

Read more RELATED
Recommended to you

Latest news