ఐపీఎల్ లో కొత్త చరిత్ర.. ఒకే సమయానికి ఇవాళ రెండు మ్యాచ్ లు

-

ఐపీఎల్‌ 2021 రెండో సీజన్‌ కు కౌంట్‌ డౌన్‌ దగ్గర పడింది. ఇవాళ్టి తో లీగ్‌ మ్యాచ్‌ లు పూర్తి కానున్నాయి. ఇందులో భాగంగానే ఇవాళ రెండు మ్యాచ్‌ లు జరుగనున్నాయి. మొదటి మ్యాచ్‌ లో సన్‌ రైజర్స్‌ హైదరాబాద్‌ జట్టు మరియు ముంబై ఇండియన్స్‌ జట్ల మధ్య జరుగనుంది. ఈ మ్యాచ్‌ అబుదాబీ లోని షే క్‌ జయాద్‌ స్టేడియం లో జరుగనుంది.

అలాగే.. రెండో మ్యాచ్‌ రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు మరియు ఢిల్లీ కాపిటల్స్‌ జట్ల మధ్య జరుగనుంది. ఈ మ్యాచ్‌ దుబాయ్‌ లోని ఇంటర్నేషనల్‌ స్టేడియం లో జరుగనుంది. అయితే.. ఇందులో ట్విస్ట్‌ ఏంటంటే.. ఇవాళ జరిగే రెండు మ్యాచ్‌ లో ఒకే సమయానికి ప్రసారం కానున్నాయి.

ఇవాళ సాయంత్రం 7.30 గంటలకు ఈ రెండు మ్యాచ్‌ లు ప్రారంభం కానున్నాయి. ఐపీఎల్‌ ప్రారంభం అయినప్పటి నుంచి ఇప్పటి వరకు ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ ఏర్పడలేదు. కానీ ఈ సారి మాత్రం ఐపీఎల్‌ యాజమాన్యం కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టింది.

Read more RELATED
Recommended to you

Latest news