ఐపిఎల్ 2023 ఫైనల్: ఉత్కంఠ మ్యాచ్ లో చెన్నై ఘన విజయం…

-

ఇండియన్ ప్రీమియర్ లీగ్ సీజన్ 16 లో ఆఖరి ఘట్టం ముగిసిపోయింది. మొన్ననే ముగియాల్సిన మ్యాచ్ కాస్తా వర్షం కారణంగా రద్దు కావడంతో నిన్న ఈ మ్యాచ్ ను నిర్వహించడం జరిగింది. అయితే టాస్ ఓడిన గుజరాత్ బ్యాటింగ్ లో నిర్ణీత ఓవర్ లలో 213 పరుగులు చేసింది. అయితే చేదనలో మూడు బంతులు పడగానే మళ్లీ వర్షం రావడంతో రాత్రి 12.10 కి మళ్లీ చేజింగ్ తిరిగి ప్రారంభం అయింది. డక్ వర్త్ లూయిస్ ప్రకారం టార్గెట్ ను 15 ఓవర్ లకు 171 గా నిర్ణయించారు అంపైర్లు. ఈ టార్గెట్ ను చెన్నై ఆఖరి బంతికి చేధించి నరాలు తెగే అంతా టెన్షన్ గేమ్ లో గెలిచి ఐపిఎల్ 2023 టైటిల్ ను కైవసం చేసుకుంది. అస్సలు గెలుస్తుంది అన్న సందేహం అందరిలోనూ నెలకొంది.

కానీ జడేజా చివరి రెండు బంతులను సిక్స్ మరియు ఫోర్ గా మలిచి చెన్నై కు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు. ఈ విజయంతో చెన్నై ఖాతాలో మొత్తం 5 ఐపిఎల్ టైటిల్ లు ఉన్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version