ఐపిఎల్ 2023: “తెలుగోడు” సిరాజ్ మాయ… పంజాబ్ కుదేలు !

-

అబ్బా .. ఈ సీజన్ లో ప్రతి ఒక్క మ్యాచ్ కూడా ఉత్కంఠను రేకెట్టిచకుండా ముగిస్తుంది అంటే అతిశయోక్తి కాదు. అదే విధంగా ఈ రోజు కాసేపటి క్రితమే ముగిసిన పంజాబ్ మరియు బెంగళూరు మ్యాచ్ లో కోహ్లీ సేన 24 పరుగుల తేడాతో విజయాన్ని సాధించింది. బెంగళూరు నిర్దేశించిన 175 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో సగం ఓవర్ లు కూడా పూర్తి కాకుండానే పంజాబ్ సగం జట్టును కోల్పోయింది. కానీ జితేష్ శర్మ కొంచెం పంజాబ్ జట్టులో ఆశలు రేపాడు.

కానీ బెంగళూరు స్పీడ్ బౌలర్ మహమ్మద్ సిరాజ్ అద్భుతమైన బౌలింగ్ తో బెంగళూరు ను ఒంటి చేత్తో గెలిపించాడు. సిరాజ్ తన కోటా ఓవర్ లలో కేవలం 24 పరుగులు ఇచ్చి 4 కీలక వికెట్లు తీసి పంజాబ్ పతనాన్ని శాసించాడు, హసరంగా 2 వికెట్లు తీసి సిరాజ్ కు సహాయం చేశాడు. గత మ్యాచ్ లో పంజాబ్ గెలుపొందగా, బెంగళూర్ ఓడింది. కానీ ఈ రెండు జట్లు తర్వాత మ్యాచ్ లలో వ్యతిరేక ఫలితాలను అందుకున్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version