ఐపిఎల్ 2024: ఆసక్తి రేపిన హార్దిక్ పాండ్య స్వాప్… చివరికి వారితోనే!

-

ఇండియన్ ప్రీమియర్ లీగ్ సీజన్ 2024 లో భాగంగా జట్టు కూర్పుల విషయమై ఐపీఎల్ పాలకమండలి చివరి తేదీని నిన్నటి వరకు ఉంచి క్లోజ్ చేసిన సంగతి తెలిసిందే. దీనితో ప్రతి ఫ్రాంచైజీ యాజమాన్యం తమ వద్ద ఎవరిని ఉంచుకోవాలి మరియు ఎవరిని వేలానికి వదిలి వేయాలి అన్న ఖచ్చితమైన నిర్ణయాన్ని తీసుకుని అధికారికంగా ప్రకటించారు. అందులో భాగంగా దేశం మొత్తాన్ని ఎంతగానో ఆసక్తిని కలిగించిన ప్లేయర్ గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్య. తన మాజీ ఫ్రాంచైజీ ముంబై ఇండియన్స్ ఇతన్ని స్వాప్ చేసుకుంటుంది అని అందరూ భావించారు. కానీ అలా జరగలేదు.. గుజరాత్ టైటాన్స్ ఆడిన మొదటి సీజన్ లోనూ టైటిల్ ను అందించిన కెప్టెన్ ను ఎవరైనా వదులుకుంటారా ? ఎంత డబ్బు పోసి అయినా తమతోనే ఉంచుకోవాలి అనుకుంటారు.. సరిగ్గా ఇక్కడ కూడా అదే జరిగింది.

గుజరాత్ టైటాన్స్ హార్దిక్ పాండ్య ను నిలుపుకుని ముంబై ఇండియన్స్ కు షాక్ ఇచ్చింది. ఇక ముంబై అభిమానులు సైతం ఈ ఘటనతో నిరాశపడ్డారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version