IRCTC టూర్ ప్యాకేజీ.. రూ.3,170 తోనే షిరిడి..!

-

ఎన్నో టూర్ ప్యాకేజీలని తీసుకు వచ్చింది IRCTC. ఈ ప్యాకేజీల తో మీరు ఎక్కడకి కావాలంటే అక్కడకి ప్లాన్ చేసుకోకుండానే వెళ్లిపోవచ్చు. షిరిడీ వెళ్లాలనుకునే సాయిబాబా భక్తులకు కూడా ఓ ప్యాకేజీని తీసుకు వచ్చింది. ఇక మరి ఆ ప్యాకేజీ వివరాలని చూసేద్దాం. ఐఆర్‌సీటీసీ టూరిజం హైదరాబాద్ నుంచి షిరిడీకి ప్రత్యేకమైన ప్యాకేజీని తీసుకు వచ్చింది.

సాయి సన్నిధి పేరుతో ట్రైన్ టూర్ ప్యాకేజీ ని తీసుకు రాగా.. ఈ టూర్ లో భాగంగా షిరిడీ, శనిశిగ్నాపూర్ చూసి వచ్చేయచ్చు. 2 రాత్రులు, 3 రోజుల టూర్ ప్యాకేజీ ఇది. ప్రతీ బుధవారం ఈ టూర్ ఉంటుంది. గురువారం రోజు షిరిడీ ఆలయాన్ని బాబా భక్తులు దర్శించుకోవచ్చు.

ఇక దీని ధర విషయానికి వస్తే.. దీని ధర ఒకరికి రూ.3,170 మాత్రమే. మొదటి రోజు హైదరాబాద్‌లో సాయంత్రం 6.50 గంటలకు అజంతా ఎక్స్‌ప్రెస్ ఎక్కాలి. నెక్స్ట్ డే నాగర్సోల్ రైల్వే స్టేషన్ చేరుకుంటారు. అక్కడ నుండి షిరిడీకి తీసుకెళ్తారు. సాయిబాబా ఆలయాన్ని దర్శించుకోవాలి. సాయంత్రం 4 గంటలకు శనిశిగ్నాపూర్ స్టార్ట్ అవ్వాలి. ఆ ఆలయాన్ని దర్శించుకోవాలి.

నాగర్సోల్ బయల్దేరాలి. రాత్రి 9.20 గంటలకు నాగర్సోల్ స్టేషన్‌లో స్టార్ట్ అయితే ఉదయం 8.50 గంటలకు సికింద్రాబాద్ రీచ్ అవుతారు. ట్రిపుల్ షేరింగ్ ఒకరికి రూ.3,170, ట్విన్ షేరింగ్ ఒకరికి రూ.3,700 చెల్లించాలి. అదే కంఫర్ట్‌లో అయితే ట్రిపుల్ షేరింగ్ ఒకరికి రూ.4,860, ట్విన్ షేరింగ్ ఒకరికి రూ.5,390 గా వుంది.

 

Read more RELATED
Recommended to you

Latest news