అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకోబోతున్న మహానటి.. నిజమేనా..?

-

టాలీవుడ్ లో మహానటి సావిత్రి తర్వాత అంతటి గుర్తింపు తెచ్చుకున్న ఏకైక హీరోయిన్ మహానటి కీర్తి సురేష్ . మహానటి సినిమా ద్వారా ఓవర్ నైట్ లోనే స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకున్న ఈమె క్రేజీ హీరోయిన్ గా మరింత పాపులారిటీని సంపాదించుకుంది..ఇదిలా ఉండగా ఈమె పై మళ్లీ పెళ్లి రూమర్లు మొదలయ్యాయి. గతంలో పలుసార్లు కీర్తి సురేష్ పెళ్లి పీటలు ఎక్కబోతోంది అంటూ వార్తలు వచ్చినా.. ఆమె తల్లిదండ్రులు వాటిని కేవలం వదంతులుగా పరిగణించి కొట్టిపారేశారు. ఇప్పుడు మళ్లీ కీర్తి పెళ్లి వార్తలు వైరల్ చేస్తూ ఉండడం గమనార్హం.

అసలు విషయంలోకి వెళ్తే.. కీర్తి సురేష్ అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకోబోతుందని, ఆమె తల్లిదండ్రులు వరుడిని కూడా చూసినట్లు పుకార్లు షికార్లు చేస్తున్నాయి. అంతేకాదు పెళ్లికి కీర్తి సురేష్ కూడా అంగీకరించినట్లు.. అందుకే హీరోయిన్ గా నటనకు గుడ్ బై చెప్పి వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టబోతున్నట్లు కూడా వార్తలు విపరీతంగా వైరల్ అవుతున్నాయి. వివాహం అనంతరం కీర్తి సురేష్ నిర్మాతగా కొనసాగాలని నిర్ణయించుకున్నట్లు కూడా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. అయితే దీనిపై అటు కీర్తి కానీ ఆమె కుటుంబ సభ్యులు కానీ ఎటువంటి ప్రకటన ఇవ్వకపోయేసరికి అంతా నిజమేనని భావించారు.

అయితే ఇందులో ఎటువంటి నిజం లేదని తేలి. ఎందుకంటే వరుస హిట్ లతో జడ్ స్పీడ్ లో దూసుకు వెళ్తున్న కీర్తి సురేష్.. ఇప్పుడే పెళ్లి చేసుకునేటట్టు కనిపించడం లేదు. ముఖ్యంగా ఈమె చేతిలో నాని సరసన నటిస్తున్న దసరా సినిమాతో పాటు మెగాస్టార్ చిరంజీవితో చెల్లిగా నటిస్తున్న భోళా శంకర్ సినిమాలు ఉన్నాయి.. మరోపక్క వీటితో పాటు మామన్నన్, సైరన్ వంటి సినిమాలు కూడా కీర్తి చేతిలో ఉన్నాయి . ఇన్ని సినిమాలో పెట్టుకొని .. సడెన్ గా పెళ్లి చేసుకుని సినిమాలకు గుడ్ బాయ్ చెప్పబోతోంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. దీన్ని బట్టి చూస్తే ఇవన్నీ కేవలం పుకార్ లే అని.. ఎవరో కావాలని కీర్తి సురేష్ ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారని అర్థమవుతోంది. అంతేకాదు ఈ విషయంపై ఆమె తల్లిదండ్రులు స్పందించకపోవడానికి కూడా కారణం లేకపోలేదు. గతంలో ఈ వార్తలను పుకార్లు గానే పరిగణించిన వీరు. మళ్లీ వార్తలు వస్తుంటే చెప్పి కూడా ప్రయోజనం ఉండదు అని సైలెంట్ గా ఉన్నట్లు తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news