అక్కినేని ఇంట ఇన్ని జంటలు విడిపోవడానికి కారణం అదేనా..!!

-

అక్కినేని నాగ చైతన్య, హీరోయిన్ సమంత గత సంవత్సరం డిసెంబర్ నెలలో విడాకులు తీసుకోబోతున్నట్లు ప్రకటించిన విషయం అందరికి తెలిసిందే. వీరిద్దరి మధ్య కొన్ని మనస్పర్ధలు రావడం వల్ల వీరిద్దరు విడిపోవాలని నిర్ణయించుకున్నారు. అయితే అక్కినేని కుటుంబంలో ఇప్పటి వరకు ఎంత మంది విడాకులు తీసుకున్నారు ఇప్పుడు మనం తెలుసుకుందాం.

అక్కినేని ఫ్యామిలీలో చాలా జంటలు విడాకులు తీసుకున్నారు. చైతన్య తండ్రి నాగార్జున ముందుగా వెంకటేష్ సోదరి లక్ష్మి ని వివాహం చేసుకున్నారు. వీరిద్దరికీ పుట్టిన బిడ్డ చైతన్య. కానీ వీరిద్దరీ మధ్య మనస్పర్ధల వల్ల విడిపోయారు.ఇక అదే విధంగా నాగార్జున మేనల్లుడు సుమంత్ కూడా తన భార్యతో విడాకులు తీసుకొని ఒంటరి జీవితాన్ని గడుపుతున్నారు. సుమంత్ కీర్తి రెడ్డి ప్రేమ వ్యవహారం అప్పట్లో చాలా హాట్ టాపిక్గా మారింది. ఇక వీరిద్దరూ వివాహం చేసుకున్న తర్వాత కొన్ని కారణాల వల్ల విడిపోయారు.

ఇక సుమంత్ సోదరి అయిన సుప్రియ కూడా తన భర్తతో విడాకులు తీసుకుంది. సుప్రియ హీరోయిన్ గా కూడా కొన్ని చిత్రాలలో నటించింది ఆ తర్వాత ఆమె సినిమాలకు దూరమై ప్రస్తుతం నిర్మాతగా అన్నపూర్ణ స్టూడియోస్ డైరెక్షన్ లో వర్క్ చేస్తోంది.

మరొకవైపు నాగార్జున చిన్న కుమారుడు హీరో అఖిల్ కూడా ఇప్పటికే నిశ్చితార్థం జరిగింది.. ఇక త్వరలో వివాహం చేసుకోబోతున్నారని అందరూ అనుకున్నారు. ఆ సమయంలోనే సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు అఖిల్. అఖిల్ ప్రేమించి పెళ్లి చేసుకోవాలనుకున్న అమ్మాయిని ఎంగేజ్మెంట్ అయిపోయిన తర్వాత ఏమైందో ఏమో కానీ ఆ వివాహం క్యాన్సిల్ అయింది.అయితే ఇదంతా జరగడానికి ఆ కుటుంబానికి ఏదో శాపం ఉంది అని మరికొంత మంది నెటిజన్లు తెలియజేస్తున్నారు. ఏది ఏమైనా కలిసి ఉండవలసిన జంటలు విడిపోవడం చాలా బాధాకరమని చెప్పవచ్చు.

Read more RELATED
Recommended to you

Exit mobile version