ప్రేమీ విశ్వనాథ్ తన భర్తకు దూరంగా ఉండడానికి కారణం ఇదేనా..?

-

కార్తీకదీపం సీరియల్ ద్వారా మరింత పాపులారిటీ సంపాదించుకున్న వంటలక్క అలియాస్ ప్రేమీ విశ్వనాథ్ కి రెండు తెలుగు రాష్ట్రాలలో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఈ గుర్తింపుతోనే ఈమె సినిమాలలో కూడా నటించాలని అభిమానులు కోరుకుంటున్నారు. ముఖ్యంగా టాలీవుడ్ లో కి వచ్చిన తెలుగు హీరోయిన్లను మించి ఈమె ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకోవడం అందరికీ ఆశ్చర్యకరమని చెప్పాలి. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు ఈ ముద్దుగుమ్మ. ఇంటర్వ్యూలో భాగంగా ప్రేమీ విశ్వనాథ్ మాట్లాడుతూ తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలను కూడా షేర్ చేసుకున్నారు.

ఇంటర్వ్యూలో భాగంగా ప్రేమీ విశ్వనాథ్ మాట్లాడుతూ.. నా పిల్లలు కేరళలో మా అమ్మ దగ్గర ఉంటున్నారు. నేను వన్ వీక్ షూటింగ్లో ఉంటే .. వన్ వీక్ కేరళలో ఉంటాను. అమ్మాయిలపై జరుగుతున్న సంఘటనల గురించి వింటే బాదేస్తుంది. ఏదైనా కేసు కోర్టుకు వెళ్లిందంటే సంవత్సరాల తరబడి ఆ కేస్ సాగదీస్తూనే ఉంటారు. పరిష్కారం అంత త్వరగా దొరకదు. నాకు ఆ భయం ఎక్కువ అందుకే నాకు పిల్లలను మా తల్లి దగ్గరే పెంచుతున్నాను అంటూ చెప్పుకొచ్చింది.

ప్రస్తుతం సినిమాల పైన ఎక్కువగా దృష్టి పెడుతున్నానని కూడా వెల్లడించింది ప్రేమీ విశ్వనాథ్. ఆమె మాట్లాడుతూ.. మా బ్రదర్ ఫోటోగ్రాఫర్.. మా బ్రదర్ తీసిన ఫోటోల వల్లే నాకు కార్తీకదీపం సీరియల్ లో ఆఫర్ వచ్చింది అని చెప్పుకొచ్చింది. భర్త గురించి మాట్లాడుతూ.. నేను కేరళలో ఉంటే నా భర్త అక్కడ నాతో కేరళలో ఉండడని, హైదరాబాదులో ఉన్న సమయంలో హైదరాబాదులో కూడా ఉండడని, నేను ఏ స్టేట్లో ఉన్న ఆయన వేరే స్టేట్లో ఉంటాడని ప్రేమీ విశ్వనాథ్ తెలిపారు. అంతేకాదు నాకంటే మా ఆయన చాలా బిజీ అంటూ ఆమె కామెంట్లు చేయడం గమనార్హం. ఇక ప్రేమి విశ్వనాథ్ ది ప్రేమ వివాహం.. అతని పేరు వినీత్.

Read more RELATED
Recommended to you

Latest news