Breaking : కౌంటింగ్‌ కేంద్రంలో ఆసక్తికర ఘటన.. కూసుకుంట్ల, కోమటిరెడ్డి కరాచలనం

-

తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న మునుగోడు ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు నేడు ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. అయితే.. ఓట్ల లెక్కింపు కేంద్రంలో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. బీజేపీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డికి టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి షేక్‌ హ్యాండ్‌ ఇచ్చి అల్ ది బెస్ట్ చెప్పారు. నల్గొండ పట్టణంలోని కౌంటింగ్ కేంద్రానికి చేరుకున్న రాజగోపాల్ రెడ్డిని కూసుకుంట్ల పలుకరించారు. ఈ సందర్భంగా అల్ ది బెస్ట్ చెప్పారు. అటు కూసుకుంట్లకు కూడా రాజగోపాల్ రెడ్డి అల్ బెస్ట్ చెప్పారు. ఇదిలా ఉంటే.. మునుగోడు ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. రౌండ్ రౌండ్‌కి ఫలితాలు మారుతుండడంతో ఉత్కంఠగా మారింది.

పోస్టల్ బ్యాలెట్, తొలి రౌండ్‌లో టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డికి ఆధిక్యం రాగా, రెండో రౌండ్‌లో బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అనూహ్యంగా ముందంజ వేశారు. తొలి రౌండ్‌లో టీఆర్ఎస్‌కు 6,096 ఓట్లు రాగా, బీజేపీకి 4,904, కాంగ్రెస్‌కు 1,877 ఓట్లు పోలయ్యాయి. దీంతో తొలి రౌండ్‌లో టీఆర్ఎస్‌కు వెయ్యికిపైగా ఓట్ల ఆధిక్యం లభించింది. అయితే, చౌటప్పల్ మండలానికి సంబంధించి లెక్కిస్తున్న రెండో రెండో రౌండ్‌లో బీజేపీ అభ్యర్థికి 789 ఓట్ల ఆధిక్యం లభించింది. దీనిని బట్టి చూస్తుంటే టీఆర్ఎస్, బీజేపీ మధ్య హోరాహోరీ పోరు తప్పేలా కనిపించడం లేదు.

Read more RELATED
Recommended to you

Latest news