విద్యార్థులకు ఇస్రో గుడ్ న్యూస్..!

-

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ విద్యార్థులకి మంచి అవకాశం ని ఇస్తోంది. ఆన్‌లైన్‌ లో సర్టిఫికెట్‌ కోర్సు పొందే అవకాశాన్ని ఇస్తోంది. పూర్తి వివరాలని చూస్తే.. ఇస్రోకు చెందిన ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ రిమోట్‌ సెన్సింగ్ డెహ్రాడూన్‌ ఈ సర్టిఫికేట్‌ కోర్సును తీసుకు వస్తోంది. ఈ కోర్సు లో కేవలం విద్యార్థులే కాకుండా పరిశోధకులు, ప్రభుత్వ సైంటిఫిక్‌ సిబ్బంది కూడా చేరొచ్చు. ఆన్‌లైన్‌లో నిర్వహించే ఈ కోర్సును పూర్తి చేస్తే విజయవంతంగా పూర్తి చేసిన వారికి సింథటిక్‌ అపార్చుర్‌ రాడార్‌ డేటా ప్రాసెసింగ్‌ లో సర్టిఫికేట్‌ ని ఇస్తారు.

ఈ కోర్సు కోసం ఎలాంటి ఫీజు కట్టాల్సిన పని లేదు. ఈ కోర్సును పూర్తి ఉచితంగా పొందొచ్చు. నాలుగు రోజుల పాటు జరగనున్న ఈ కోర్సును ఏప్రిల్‌ 10వ తేదీ నుంచి 14వ తేదీ వరకు నిర్వహిస్తారు. ఆన్‌లైన్‌ సెషన్‌ సాయంత్రం 4 గంటల నుంచి 5.30 గంటల దాకా ఉంటుంది. ఒక్కో సెషన్‌ గంటన్నర పాటు ఉంటుంది. గ్రాడ్యుయేషన్‌ లేదా పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసిన వాళ్ళు ఈ కోర్సు ని పూర్తి చేసేయచ్చు.

కేంద్ర/ రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన టెక్నికల్‌/సైంటిఫిక్‌ సిబ్బంది/ ఫ్యాకల్టీ, యూనివర్సిటీ/ ఇన్‌స్టిట్యూ్షన్స్‌లోని పరిశోధకులు దీనికి అర్హులు. రిమోట్‌ సెన్సింగ్‌, డిజిటల్‌ ఇమేజ్‌ ప్రాసెసింగ్‌పై అవగాహన ఉండాలి. సర్టిఫికేట్‌ ని ఇస్తారు. అధికారిక వెబ్‌సైట్‌ ద్వారా వివరాలను అందించాలి. చేరాలి అనుకునే వారు సంస్థలు, యూనివర్సిటీలు, డిపార్ట్‌మెంట్లు సొంతంగా కో-ఆర్డినేటర్‌ను నియమించుకోవాలి. కో-ఆర్డినేటర్‌ రిజిస్టర్‌ చేసుకోవాలి.

 

Read more RELATED
Recommended to you

Latest news