అది ఓ అందమైన జలపాత..కానీ దాని స్థలం పురాణం చెప్తే చెమటలే..!!

-

ట్రావలింగ్‌ అంటే ఇష్టపడే వాళ్లకు మేఘాలయ గురించి ఐడియా ఉంటుంది. అక్కడ ఉంటే వాటర్‌ ఫాల్స్‌ ఎవరినైనా కట్టిపడేస్తాయి. మేఘాలయలోని నోహ్కాలికై వాటర్ ఫాల్స్‌ చాలా ఫేమస్. అందుకు ప్రత్యేక కారణాలు ఉన్నాయి. ఇది ఇండియాలో అతి ఎత్తైన ప్లంజ్ జలపాతంగా గుర్తింపు పొందింది. డిసెంబర్ నుంచి ఫిబ్రవరి మధ్య దీని పరిసర ప్రాంతాలు చూడటానికి మస్త్‌ ఉంటాయి. ఆ సమయంలో ఇక్కడికి వెళ్లేందుకు పర్యాటకులు ఆసక్తి చూపిస్తారు. ఈ జలపాతం వద్ద ఓ ఘోర సంఘటన జరిగింది. మరి ఆ భయంకర కథేంటో చూద్దామా..!
ఖాసీ భాషలో ‘కా’ అనేది స్త్రీ లింగం.. లికై అనేది ఒక స్త్రీ పేరు. అయితే స్థానిక పురాణాల ప్రకారం.. నోహ్కాలికై జలపాతానికి పైన ఓ గ్రామం ఉండేదట.. అదే రంగ్జిర్తెహ్ గ్రామం. అక్కడ లికై అనే మహిళ ఉండేది.. ఆమె భర్త చనిపోయాడు. తన బిడ్డతో పాటు ఉండేది. తన బిడ్డను చూసుకోవడానికి ఆమెకు కష్టంగా ఉండటంతో.. మరో వివాహం చేసుకుంది. ఆమె రెండో భర్త దుర్మార్గుడు. ఏముంది.. ఎక్కడైనా జరిగేదేగా.. మొదటి భర్త కూతురు అంటే అస్సలు ఇష్టం ఉండేది కాదు. ఓ రోజు భార్యకి వంట చేసి పెట్టాడు. ఆ సమయంలో బిడ్డ కనిపించ లేదు.
ఆ బిడ్డని చంపేసి భార్యకు వండి పెట్టాడు ఆ రాక్షసుడు. మాంసం కూర తినేసి తమలపాకులు, వక్క వేసుకునేటప్పుడు ఆమెకి ఇదంతా తెలిసిందట. లికై.. తమలపాకులు వేసుకునే చోటికి వెళ్ళాక అక్కడ ఒక చిన్న వేలు ఉంది. అది చూసి.. ఆమెకు అసలు విషయం అర్థమైంది. ఆ తర్వాత ఆమె.. ఓ చేతిలో గొడ్డలితో.. ఊర్లో పరుగులు పెడుతూ.. చివరకు జలపాతంలో పడిపోయినట్లు కథ.. దాంతో ఆమె పేరు మీదనే నోహ్కాలికై అనే పేరు వచ్చింది.
ఇదంతా నిజంగా జరిగింది అని చెప్పడానికి ఎలాంటి ఆధారాలు లేవు. స్థానికులు మాత్రం ఇదే కథను చిన్న చిన్న మార్పులతో అన్ని జనరేషన్స్‌కు చెప్తారు. చాలా మంది ఈ కథను తెలుసుకొని.. స్థానికులు చెప్పే విషయాలు రికార్డ్ చేసుకుంటారు. కానీ ఎవరూ దీన్ని నిరూపించలేదు.

Read more RELATED
Recommended to you

Latest news