పాపం రఘురామ… రెండు రోజుల తర్వాత బెయిల్…?

-

వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణం రాజుని ఎప్పుడు విడుదల చేస్తారు ఏంటీ అనేది స్పష్టత రావడం లేదు. ప్రస్తుతం ఆయన సికింద్రాబాద్ మిలిటరీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మిలటరీ హాస్పిటల్ కు రఘురామ బెయిల్ ఆర్డర్ కాపీ అందింది. షూరిటీలు దాఖలు చేసి బెయిల్ కాపీలు జైలు కు అందాల్సి ఉంది. జైలు కు కాపీలు అందిన తర్వాత బెయిల్ ఫార్మాల్టీస్ మొదలుకానున్నాయి.

ఇంకా జ్యూడిషియల్ కష్టడీ లోనే రఘురామ కృష్ణ రాజు ఉన్నారు. మిలటరీ ఆస్పత్రిలో జైల్ సిబ్బంది నిఘా లో రఘు రామ కృష్ణ రాజు ఉన్నారు. జైలు నుండి హాస్పిటల్ లో సిబ్బందికి ఆర్డర్ కాపీ లు అందాల్సి ఉంది అని అంటున్నారు. అప్పుడే రఘురామ కృష్ణం రాజు బెయిల్ ద్వారా రిలీజ్ అయ్యే అవకాశం ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news