“టైగర్ నాగేశ్వరరావు” నిర్మాత అభిషేక్ అగర్వాల్ ఆఫీస్ పై ఐటీ శాఖ దాడులు…!

-

తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ప్రముఖ టాలీవుడ్ నిర్మాత అభిషేక్ అగర్వాల్ ఆఫీస్ పై ఐటి శాఖకు చెందిన అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. మాములుగా ఐటి శాఖ ఆదాయానికి మించిన ఆస్తులు ఉంటే వారిని ప్రత్యేక నిఘా సమాచారాన్ని ఆధారంగా చేసుకుని ఎవరి ఇళ్లల్లో లేదా ఆఫీస్ లలో అయినా దాడులను చేసే అధికారం వారికి ఉంటుంది. ఇప్పటి వరకు ఎంతో మంది ఇల్లు మరియు ఆఫీస్ లలో సోదాలు నిర్వహించి ఆదాయానికి మించిన ఆస్తులను, నగదును, గోల్డ్ ను కలుగొని సీజ్ చేసిన పరిస్థితులు ఉన్నాయి. అదే విధంగా ఇప్పుడు రవితేజ హీరోగా నటిస్తున్న టైగర్ నాగేశ్వరరావు సినిమాకు నిర్మాతగా వ్యవహరించిన అభిషేక్ పిసుట్రెస్ అధినేత అభిషేక్ అగర్వాల్ ఆఫీస్ పై ఏమైనా ఐటీ నియమాలకు విరుద్ధంగా డబ్బు లేదా ఆస్తులు దొరుకుతాయేమో అని దాడులు చేస్తున్నారు.

ఇంకా వీరు ఆఫీస్ లో సోదాలను నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. మరి ఈ సోదాలలో ఏమైనాకీలక ఆధారాలు దొరికాయి లేదా అన్నది తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version