నుపుర్ శర్మ వ్యాఖ్యలపై మోదీ వెంటనే స్పందించి ఉంటే బాగుండేది: చిదంబరం

-

మహమ్మద్ ప్రవక్త పై నుపుర్ శర్మ, నవీన్ జిందాల్ అనుచిత వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో చెలరేగిన వివాదంపై ప్రధాని మోదీ వెంటనే స్పందించి ఉంటే బాగుండేదని కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరం అభిప్రాయపడ్డారు. ఈ విషయంపై మోడీ జోక్యం చేసుకోకుండా, మౌనం వహించడం సరికాదని ఆయన చెప్పారు. ఇస్లామోఫోబియా గురించి దేశంలోని ప్రతిపక్ష పార్టీలు, పౌర సమాజ నాయకులు, రచయితలు, స్కాలర్లు, సామాన్యులు ప్రభుత్వాన్ని ముందస్తుగానే హెచ్చరించారని.. కానీ ప్రభుత్వం పట్టించుకోలేదని చిదంబరం అన్నారు.

ఇప్పుడు 16 దేశాలు దీనిపై నిలదీస్తే కేంద్ర ప్రభుత్వం మేల్కొందని చిదంబరం చెప్పారు. లౌకిక వాదాన్ని కొనసాగించడంలో బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో లేదని ఆయన విమర్శించారు.నుపుర్ శర్మ కు మద్దతుగా సాధ్వి ప్రజ్ఞా సింగ్ ఠాకూర్ వ్యాఖ్యలు చేసినట్లు తాను వార్తల్లో చదివానని ఆయన అన్నారు. బీజేపీలోని మరికొందరు నుపుర్ శర్మ, నవీన్ జిందాల్ కు మద్దతుగా వ్యవహరిస్తుండడం.. 16 దేశాల్లో నిరసనలు తెలుపుతుండడం వల్ల బిజెపి వైఖరి ఎటువంటిదో స్పష్టమవుతోందని చిదంబరం చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news