జబర్దస్త్ కమెడియన్ ఇంట తీవ్ర విషాదం..!!

-

ఈ మధ్యకాలంలో సినీ ఇండస్ట్రీలోనే కాదు బుల్లితెర ఇండస్ట్రీలో కూడా మరణాలు సంభవిస్తున్నాయి. ఈమధ్య కాలంలో కరోనా వచ్చిన తర్వాత నుంచి మరీ ఎక్కువగా వరుస మరణాలు చోటు చేసుకుంటూ ఉండడం అందరినీ భయాందోళనకు గురిచేస్తుంది. ఈ క్రమంలోనే జబర్దస్త్ ద్వారా కమెడియన్ గా మంచి గుర్తింపు సంపాదించుకున్న పటాస్ ప్రవీణ్ ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది .ఇక అతడి కుటుంబం పూర్తిగా శోకసంద్రంలో మునిగిపోయిందని చెప్పవచ్చు. ప్రవీణ్ తండ్రి గత కొంతకాలంగా బ్రెయిన్ ట్యూమర్ సమస్యతో బాధపడుతున్నట్లు సమాచారం. కానీ ఆయన మంగళవారం ఆయన కన్నుమూశారు.ఇకపోతే ప్రవీణ్ తండ్రి గత కొంతకాలం నుంచి బ్రెయిన్ ట్యూమర్ తో బాధపడుతున్న నేపథ్యంలో ఆయనను బ్రతికించడానికి వైద్యులు తీవ్ర ప్రయత్నాలు చేశారు. కానీ ఫలితం మాత్రం లేకపోయింది. చికిత్స అందిస్తున్న దశలోనే కాళ్లు, చేతులు విపరీతంగా వాయడంతో పాటు ఆరోగ్యం మరింత క్షీణించింది. ఇక దీంతో ఇదే చివరి స్టేజ్ అని వైద్యులు కూడా తేల్చేశారు. దీంతో తండ్రిని బ్రతికించుకునేందుకు ప్రవీణ్ చేసిన అన్ని ప్రయత్నాలు కూడా వృధా అయ్యాయని చెప్పవచ్చు. అంతేకాదు చిన్నవయసులోనే తల్లిని కోల్పోయిన ప్రవీణ్ ఇప్పుడు తండ్రి కూడా దూరం కావడంతో తీవ్ర విషాదంలో మునిగిపోయాడు.. ఇక ఒంటరివాడైన ప్రవీణ్ ని చూసి బుల్లితెర ఇండస్ట్రీ మొత్తం శోకసంద్రంలో మునిగిపోయింది.

చిన్నప్పుడే ప్రవీణ్ తల్లి చనిపోయినా కూడా తన తండ్రి మాత్రం ఇంకొక వివాహం చేసుకోకుండా ఇద్దరు కొడుకులు పెంచి పెద్ద చేశారు. తమను బాగా చదివించుకుంటూ తన జీవితాన్ని త్యాగం చేశారు అని గతంలో ప్రవీణ్ చెప్పిన విషయం తెలిసిందే. కానీ ఇలా ఉన్నట్టుండి తల్లి, తండ్రి ఇద్దరూ దూరమవడంతో ప్రవీణ్ పరిస్థితి ఎటు కాకుండా పోయింది. పటాస్ కామెడీ షో లో పంచులు, ప్రాసలతో కమెడియన్ గా పేరు తెచ్చుకున్న ప్రవీణ్ కి జబర్దస్త్ ద్వారా మరింత గుర్తింపు లభించింది. ఇకపోతే పలువురు తోటి కమెడియన్లు కూడా ప్రవీణ్ తండ్రి మరణానికి సంతాపం తెలియజేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version