వాహనదారులకు శుభవార్త…రోడ్‌ సేఫ్ట్‌ ఫండ్‌ ఏర్పాటుకు జగన్‌ గ్రీన్‌సిగ్నల్‌

-

ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర వాహనదారులకు సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి శుభవార్త చెప్పారు. రోడ్డు భద్రతామండలి సమావేశంలో పలు కీలక నిర్ణయాలకు సీఎం జగన్‌ గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చారు. రోడ్‌ సేఫ్ట్‌ కోసం లీడ్‌ ఏజెన్సీ ఏర్పాటుకు పచ్చజెండా ఊపిన సీఎం జగన్.. పోలీసు, ట్రాన్స్‌పోర్ట్, హెల్త్‌, రోడ్‌ ఇంజినీరింగ్‌ డిపార్ట్‌మెంట్‌ నుంచి నిపుణులతో లీడ్ ఏజెన్సీ ఏర్పాటు చేయాలని నిర్నయం తీసుకున్నారు. ముఖ్యంగా… రోడ్‌ సేఫ్ట్‌ ఫండ్‌ ఏర్పాటుకు సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు.

CM Jagan Mohan Reddy
CM Jagan Mohan Reddy

ప్రమాద బాధితులకు చికిత్స కోసం క్యాష్‌లెస్‌ ట్రీట్‌ మెంట్‌ అందేలా నెట్‌వర్క్‌ ఆస్పత్రుల జాబితాలోకి ప్రోత్సాహం ఇవ్వాలని నిర్ణయించిన ముఖ్యమంత్రి.. ఐరాడ్‌ యాప్‌ వినియోగించుకుని ప్రమాదాల పై లైవ్‌ అప్‌డేట్‌ పొందేలా పోలీసులు తగిన చర్యలు తీసుకోవాలన్నారు. పీపీపీ పద్ధతిలో రవాణాశాఖ ద్వారా ఆటోమేటెడ్‌ ఎఫ్‌సీ టెస్టింగ్‌ ఏర్పాటుపై కార్యాచరణ చేయాలని పేర్కొన్నారు. రోడ్డు ప్రమాద బాధితులకు బీమా పరిహారం దక్కేలా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని అధికారులకు సీఎం ఆదేశాలు జారీ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news