పిచ్చి తుగ్లక్ నిర్ణయాలు తీసుకుంటున్న జగన్ పతనం ప్రారంభమైంది – బోండా ఉమా

-

విజయవాడలోని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్చుతూ ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయం పై టిడిపి ఎమ్మెల్యే బోండా ఉమ ఫైర్ అయ్యారు. ఈ నిర్ణయంపై ధర్నా చౌక్ లో నిరసనకు దిగారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పిచ్చి తుగ్లక్ లా నిర్ణయాలు తీసుకుంటున్న జగన్ పతనం ప్రారంభమైందని మండిపడ్డారు. హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరును తొలగించడాన్ని ఖండిస్తున్నామని పేర్కొన్నారు.

ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి అదే పేరు కొనసాగించాలన్నారు. వైయస్సార్ పేరు పెట్టుకోవాలనుకుంటే కొత్త హాస్పిటల్ కట్టి పేరు పెట్టుకోమని సూచించారు. 1986లో పేద ప్రజలకు వైద్యం అందించే దిశగా స్వర్గీయ ఎన్టీ రామారావు హెల్త్ యూనివర్సిటీ ఏర్పాటు చేశారని పేర్కొన్నారు. జగన్ చెల్లెలు షర్మిల స్వయంగా పాదయాత్రలో పేరు మార్పును ఖండించారని.. చెల్లెలికి ఉన్న ఇంగిత జ్ఞానం కూడా సైకో జగన్ కి లేదని ఘాటు వ్యాఖ్యలు చేశారు. అమరావతి రాజధాని రైతులకు అడుగడుగునా నీరాజనాలు పట్టడంతో జగన్ తట్టుకోలేకనే ఇలాంటి పిచ్చి తుగ్లక్ నిర్ణయాలు తీసుకుంటున్నాడని మండిపడ్డారు.

Read more RELATED
Recommended to you

Latest news