ఇవాళ కడప జిల్లాలో సీఎం జగన్ పర్యటన.. షెడ్యూల్ ఇదే..!

-

ఇవాల్టి నుంచి మూడు రోజులపాటు వైయస్సార్ కడప జిల్లాలో పర్యటించనున్నారు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి. పలు అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్షలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. వైయస్సార్ కడప జిల్లా పర్యటనలో భాగంగా ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు సీఎం జగన్ తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి.. 2:20 గంటలకు గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడనుండి 2:30 గంటలకు విమానంలో కడపకి బయలుదేరుతారు.

3:30 గంటలకు వేముల మండలం వేల్పుల గ్రామానికి చేరుకొని సచివాలయము కాంప్లెక్స్ ని ప్రారంభించబోతున్నారు. సాయంత్రం 5:15 గంటలకు అక్కడి నుండి బయలుదేరి.. ఇడుపులపాయ చేరుకొని రాత్రికి వైయస్సార్ గెస్ట్ హౌస్ లో బస చేయనున్నారు. ఇక రేపు ఉదయం 8:50 గంటలకు ఇడుపులపాయ గెస్ట్ హౌస్ నుండి బయలుదేరి 9:40 గంటలకు వైఎస్ఆర్ ఘాట్ వద్ద దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా జరిగే ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొంటారు.

 

తర్వాత అక్కడి నుండి బయలుదేరి ఎస్టేట్ లోని ప్రేయర్ హాల్లో పులివెందుల నియోజకవర్గ అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్ష నిర్వహిస్తారు. రాత్రికి ఎస్టేట్లోని వైయస్సార్ గెస్ట్ హౌస్ లో బసచేస్తారు. సెప్టెంబర్ మూడవ తేదీన ఉదయం 9 గంటలకు ఇడుపులపాయ నుండి బయలుదేరి 10:40 గంటలకు తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు.

Read more RELATED
Recommended to you

Latest news