వైయస్సార్ 13వ వర్ధంతి.. సీఎం జగన్ నివాళులు

-

దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి.. గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. వైయస్ రాజశేఖర్ రెడ్డి.. రెండు తెలుగు రాష్ట్రాల్లో.. మంచి స్థానాన్ని సంపాదించుకున్నారు. పేదల మరియు రైతుల బతుకులలో వెలుగులు నింపారు వైయస్ రాజశేఖర్ రెడ్డి. అయితే వైయస్ రాజశేఖర్ రెడ్డి… విమాన ప్రమాదంలో చనిపోయి.. నేటికీ 13 సంవత్సరాలు పూర్తయింది.

ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి… రాజశేఖర్ రెడ్డి కి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా సీఎం జగన్.. ఎమోషనల్ వ్యాఖ్యలు కూడా చేశారు. నాన్న వైఎస్ఆర్ భౌతికంగా దూరమైనా నేటికీ ఆయన చిరునవ్వు, ఆ జ్ఞాపకాలు అలానే నిలిచి ఉన్నాయన్నారు సీఎం జగన్. దేశచరిత్రలోనే సంక్షేమాన్ని సరికొత్తగా నిర్వచించి.. ప్రజల అవసరాలే పాలనకు ప్రధానాంశం కావాలని ఆయన చాటి చెప్పారన్నారు. ప్రతి అడుగులోనూ నాన్నే స్ఫూర్తిగా ఇకపై కూడా ఈ ప్రభుత్వం అడుగులు వేస్తుందని వివరించారు సీఎం జగన్ మోహన్ రెడ్డి.

Read more RELATED
Recommended to you

Latest news