ఈ నెల 5న ప్రజా సంగ్రామ యాత్ర సభలో పాల్గొననున్న నడ్డా

-

తెలంగాణ బీజేపీ చీఫ్‌, ఎంపీ బండి సంజయ్‌ రెండో దశ ప్రజా సంగ్రామ యాత్రను ప్రారంభించిన విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం ప్రజా సంగ్రామ యాత్రం ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో కొనసాగుతోంది. అయితే ఈ నెల 5న మహాబూబ్‌నగర్‌లో బీజేపీ ప్రజా సంగ్రామ యాత్ర పేరిట సభను నిర్వహించ తలపెట్టింది. అయితే ఈ సభకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా రానున్నట్లు బీజేపీ నేతలు ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా నేతలతో బండి సంజయ్ సమావేశం నిర్వహించారు.

BJP MP Bandi Sanjay says CM KCR is running Telangana in drunken state after police raid on rave party - India News

ఈ సందర్భంగా బండి సంజయ్‌ మాట్లాడుతూ.. కనీవినీ ఎరగని రీతిలో జేపీ నడ్డా సభను సక్సెస్ చేద్దామని, పాలమూరు గడ్డ బీజేపీ అడ్డా అని ఆయన వ్యాఖ్యానించారు. బీజేపీ కార్యకర్తల సత్తా చూపండి అని ఆయన బీజేపీ నేతలకు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. అంతేకాకుండా మండలాలు, గ్రామాలు, బూత్ ల వారీగా జన సమీకరణపై దృష్టి సారించి సభను విజయవంతం చేయాలన్నారు. జిల్లా కేంద్రంలోని ఎంవీఎస్ కళాశాల మైదానంలో బహిరంగ సభను ఏర్పాటు చేస్తున్నామన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news