నేను ఇప్పుడు బీజేపీలో ఉన్నా: జీవిత రాజశేఖర్‌

-

దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన ‘వ్యూహం’ చిత్రాన్ని ప్రాంతీయ సెన్సార్ బోర్డు ఇటీవల తిరస్కరించింది. దాంతో ఈ చిత్రం సెన్సార్ బోర్డు రివైజింగ్ కమిటీ ముందుకెళ్లింది. ఈ రివైజింగ్ కమిటీలో నటి జీవితా రాజశేఖర్ సభ్యురాలిగా ఉన్నారు. ఇప్పుడామెను రివైజింగ్ కమిటీ నుంచి తప్పించాలని టాలీవుడ్ నిర్మాత నట్టి కుమార్ డిమాండ్ చేశారు. జీవిత గతంలో వైసీపీలో ఉన్నారని, ఇప్పుడామె బీజేపీలో ఉన్నప్పటికీ వైసీపీతో సంబంధాలు ఉంటాయని, అందుకే ఆమెను కమిటీ నుంచి తాత్కాలికంగా తప్పించాలని నట్టి కుమార్ పేర్కొన్నారు.

దీనిపై జీవిత స్పందించారు. తాను ఇప్పుడు బీజేపీలో ఉన్నానని వెల్లడించారు. తనకు, వైసీపీకి ఎలాంటి సంబంధం లేదని ఆమె స్పష్టం చేశారు. మీడియాలో సర్క్యులేట్ చేస్తున్న ఫొటోలు చాలా సంవత్సరాల నాటివని జీవిత తెలిపారు. ‘వ్యూహం’ అనే సినిమా రివైజింగ్ కమిటీ ముందుకు వచ్చినప్పుడు అన్ని సినిమాలు చూసినట్టుగానే ఆ సినిమాను కూడా చూస్తానని పేర్కొన్నారు. దీనిపై తనకు ఇంకా ఇంకా ఆఫీస్ నుంచి ఎటువంటి సమాచారం రాలేదని తెలిపారు. అయినా, తన గురించి ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదని జీవిత వ్యాఖ్యానించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version