సీఎం ఇంట్లో కరోనా కలకలం.. భార్య, పిల్లలు,15 మంది సిబ్బందికి కరోనా

-

దేశంలో కరోనా తీవ్రత పెరుగుతోంది. ఎన్నడూ లేని విధంగా కేసులు నమోదవుతున్నాయి. గతంలో రోజూవారీ కేసుల సంఖ్య కేవలం 10 లోపే ఉండేది ప్రస్తుతం కేసుల సంఖ్య లక్షను దాటింది. ఇదిలా ఉంటే పలువురు ప్రముఖులు, రాజకీయ నాయకులు కరోనా మహమ్మారి బారిన పడుతున్నారు. తాజాగా జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరేన్ ఇంట్లో కరోనా కలకలం రేపింది. భార్య, పిల్లలతో పాటు మొత్తం 15 మంది సిబ్బందికి కోవిడ్ పాజిటివ్ వచ్చింది. అయితే సీఎం హేమంత్ సోరెన్ కు మాత్రం నెగిటివ్ గా వచ్చిందిని రాంచీ చీఫ్ మెడికల్ ఆఫీసర్ వినోద్ కుమార్ వెల్లడించారు. ముఖ్యమంత్రి నివాసంలో మొత్తం 62 మందికి కరోనా పరీక్షలు చేయగా.. శనివారం సాయంత్రానికి 24 మంది రిపోర్టులు వస్తే వాటిలో 15 మందికి పాజిటివ్ గా తేలింది.

హేమంత్ సోరెన్ భార్య కల్పనా సొరెన్.. ఆయన ఇద్దరు కుమారులు నితిన్, విశ్వజిత్, కోడలు సరళా ముర్ముకూ కూడా కరోనా సోకింది. అయితే కరోనా సోకినవారందరికీ కేవలం స్వల్ప లక్షణాలు ఉండటంతో ఇంట్లోనే క్వారంటైన్ లో ఉన్నారు. మరోవైపు జార్ఖండ్ ఆరోగ్య శాఖ మంత్రి బన్నా గుప్తా కూడా కరోనా బారిన పడ్డారు.

 

 

 

Read more RELATED
Recommended to you

Latest news