జగన్‌ సర్కార్‌ కు ఉద్యోగ సంఘాల షాక్‌ !

-

జగన్‌ మోహన్ రెడ్డి సర్కార్‌ కు ఉద్యోగ సంఘాలు ఊహించని షాక్‌ ఇచ్చేందుకు రెడీ అయ్యారు. త్వరలోనే సమ్మెకు దిగే ఆలోచన లో ఉన్నారు ఏపీ ఉద్యోగులు. ఇందులో భాగంగానే… ఇవాళ ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర సీఎస్ సమీర్ శర్మ కు సమ్మె నోటీసు ఇవ్వనున్నాయి ఉద్యోగ సంఘాలు. ఇవాళ మధ్యాహ్నాం 12 గంటలకు సీఎస్ సమీర్ శర్మకు సమ్మె నోటీసు ఇవ్వనుంది ఏపీ జేఏసీ, ఏపీ అమరావతి జేఏసీల ఐక్య వేదిక.

Jagan

ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రంలోని అన్ని జిల్లా ల్లోనూ సమ్మె నోటీసులు ఇవ్వనున్నారు ఉద్యోగ సంఘాల ప్రతినిధులు. పీఆర్సీ సహా డీఏ బకాయిలు, సీపీఎస్ రద్దు, కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్దీకరణ వంటి డిమాండ్లతో ఉద్యమ కార్యాచరణ ప్రకటించాయి ఉద్యోగ సంఘాలు. ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర వ్యాప్తంగా నల్ల బ్యాడ్జీలతో నిరసనలు, ర్యాలీలు, ధర్నాలు సహా విశాఖ, తిరుపతి, ఏలూరు, ఒంగోలు నగరాల్లో డివిజన్ స్థాయి సదస్సులు నిర్వహించనున్నాయి ఉద్యోగ సంఘాలు. జగన్‌ మోహన్‌ రెడ్డి తమ డిమాండ్లను నెరవేర్చే వరకు.. తాము తగ్గబోమని హెచ్చరించారు ఉద్యోగ సంఘం నేతలు.

Read more RELATED
Recommended to you

Exit mobile version