కార్యకర్తల చలవతోనే జగన్ సీఎం అయ్యారు – జోగి రమేష్

-

భారత దేశంలో ఏ నాయకుడు చేయనన్ని కిలోమీటర్లు పాదయాత్ర చేసిన ఏకైక నాయకుడని 151 స్థానాలు గెలిచిన ధీరుడు, ధీశాలి జగన్ అని పేర్కొన్నారు మంత్రి జోగి రమేష్. కార్యకర్తల చలవతోనే జగన్ సీఎం అయ్యారు…మేం మంత్రులం అయ్యామని.. పార్టీలో శాత్వతంగా ఉండేది కార్యకర్తలేనన్నారు. తల్లి లాంటి పార్టీని అందరూ కాపాడుకోవాలి.. 2024లో జగన్ కు ఓటేయడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పారు.

ప్రభుత్వం చేస్తున్న అభివృద్ది చంద్రబాబుకు కనిపించడం లేదా?? చంద్రబాబు, దత్త పుత్రుడు, వాళ్ళ మీడియా అంతా కలిసి వచ్చినా జగన్‌ను ఇంచు కూడా కదపలేరని పేర్కొన్నారు. నారా చంద్రబాబు చిన్న జిల్లాల పర్యటనకు బయల్దేరాడు.. పప్పూ, బెల్లాల మాదిరి ప్రజలకు పంచేస్తున్నారని గోల చేస్తున్నాడు.. రాష్ట్రం దివాలా తీస్తుందని చంద్రబాబు అంటున్నాడని విరుచుకుపడ్డారు.

14 ఏళ్లు సీఎంగా చేసిన చంద్రబాబు ప్రజల కోసం ఒక్క పథకమైనా పెట్టాడా?? సింహం కడుపున సింహమే పుడుతుందన్నారు. జగన్ మోహన్ రెడ్డి పాలనే అందుకు నిదర్శనమని.. వైఎస్సార్సీపీ ప్రభుత్వాన్ని ఢీ కొట్టే దమ్ము చంద్రబాబుకి ఉందా?? అని సవాల్‌ విసిరారు. పొత్తుల కోసం చంద్రబాబు పొర్లాడుతున్నాడు.. అందరూ కట్టకట్టుకుని వచ్చినా చిత్తు చిత్తుగా ఓడిస్తామని హెచ్చరించారు. కార్యకర్తల మౌత్ టాక్ దెబ్బకు ఎల్లో మీడియా పారిపోవాల్సిందేనన్నారు. మరో 25 ఏళ్లు జగనే సీఎం.. రాసి పెట్టుకో చంద్రబాబు అని స్పష్టం చేశారు మంత్రి జోగి రమేష్.

Read more RELATED
Recommended to you

Latest news