సింహం సింగిల్‌గానే వస్తుంది..జగన్ కూడా అంతే – మంత్రి జోగి రమేష్

-

సింహం సింగిల్‌గానే వస్తుంది.. ముఖ్యమంత్రి జగన్ మోహన్‌ రెడ్డి కూడా అంతేనని మంత్రి జోగి రమేష్ అన్నారు. పొత్తుల కోసం చంద్రబాబు ఆరాటం, ప్యాకేజీ కోసం పవన్ కళ్యాణ్ పోరాటం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంత మంది కలిసినా 2024లో వచ్చేది వైసీపీ ప్రభుత్వమేనని స్పష్టం చేశారు. సింహం సింగిల్‌గానే వస్తుందని.. ముఖ్యమంత్రి జగన్ కూడా అంతేనన్నారు.

jogi ramesh

2014లో ముగ్గురు కలిసి పోటీ చేశారు, 2019లో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలేలా ప్రయత్నించారని… పెద్ద ఎత్తున అభివృద్ధి, సంక్షేమం చేస్తున్న ప్రభుత్వం పై ప్రజా వ్యతిరకత ఎందుకు ఉంటుందని పేర్కొన్నారు. ప్రజా వ్యతిరేకత చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పైనే ఉంటుందని వెల్లడించారు. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కలిసి పోటీ చేస్తారని సంకేతాలు ఇచ్చారని.. ప్రజలు తనను నమ్మటం లేదనే విషయం చంద్రబాబుకు కూడా అర్ధం అయ్యిందని మండిపడ్డారు.

Read more RELATED
Recommended to you

Latest news