ప్రణాళికతో ముందుకు వెళ్లండి : జేపీ నడ్డా

-

బీజేపీ తెలంగాణ చీఫ్ బండి సంజ‌య్ చేప‌ట్టిన రెండో దశ ప్ర‌జా సంగ్రామ యాత్ర ముగింపు సంద‌ర్భంగా ఏర్పాటు చేసిన బ‌హిరంగ స‌భ‌కు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హాజరయ్యారు. ఈ సందర్బంగా జేపీ నడ్డా గురువారం మ‌హ‌బూబ్ న‌గ‌ర్‌లో పార్టీ ప‌దాధికారుల స‌మావేశాన్ని నిర్వ‌హించి.. పార్టీ నేత‌ల‌కు ఆయ‌న ప‌లు స‌ల‌హాలు, సూచ‌న‌లు చేశారు. బీజేపీలోకి చేరేందుకు కొత్త వారు వ‌స్తున్నార‌ని, వారిని ఆహ్వానించాల‌ని, అడ్డుకోరాద‌ని సూచించారు.

JP Nadda's Twitter account hacked, post says 'Stand with people of Russia' - India News

పార్టీలో త‌మ‌కు దక్కుతున్న ప్రాధాన్య‌త‌ను ఇత‌ర నేత‌ల‌తో పోల్చి చూసుకోవ‌ద్ద‌ని కూడా ఆయ‌న హితవు పలికారు. ప్ర‌తి నెలా ప్ర‌ణాళిక‌లు సిద్ధం చేసుకుని ముందుకు సాగాల‌న్నా నడ్డా.. ప్ర‌ణాళిక‌లు లేకుండా ఏ నేత ప‌ర్య‌ట‌న‌లు కూడా వ‌ద్ద‌ని సూచించారు. క్షేత్ర స్థాయిలో పార్టీని బ‌లోపేతం చేసే దిశ‌గా సాగాల‌ని కోరారు. దేశంలోని అన్ని పార్టీలు కుటుంబ పార్టీలేన‌ని, అందుకు భిన్నంగా ఉన్న ఏకైక పార్టీ బీజేపీనేన‌ని తెలిపారు న‌డ్డా. పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలన్నారు. కేంద్ర పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news