తెలంగాణలో ముందస్తు ఖాయం..మరో 6 నెలల్లోనే ఎన్నికలు – కేఏ పాల్

-

ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలకు కేరాఫ్‌ అడ్రస్‌. అయితే, కేఏ పాల్‌ తాజాగా తెలంగాణ రాష్ట్రంలో ముందస్తు ఎన్నికల ప్రచారంపై స్పందించారు. తెలంగాణలో ముందస్తు ఎన్నికలు రావడం ఖాయమని, మరో ఆరు నెలల్లో ఎన్నికలు వస్తాయంటు జోస్యం చెప్పారు.

కెసిఆర్ తప్పనిసరిగా ముందస్తు ఎన్నికలకు వెళ్తారని అభిప్రాయపడ్డారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చిన ప్రజాశాంతి పార్టీ రాష్ట్రంలోని 119 స్థానాల్లో పోటికి దిగుతుందని కేఏ పాల్ ప్రకటించారు. రాబోయే రోజుల్లో ప్రజాశాంతి పార్టీ ప్రజల్లోకి వెళుతుందని, పంజాబ్, ఢిల్లీ తరహాలో తెలుగు ప్రజలు కూడా మార్పును చూపించాలని కేఏ పాల్ కోరారు. మునుగోడులో తనకే మెజారిటీ ఓట్లు పడ్డాయని, ఈవీఎంలు మార్చి టీఆర్ఎస్, బిజెపి ఓట్లు పంచుకున్నాయని ఆరోపించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version