దేశ చరిత్రలో బర్తరఫ్‌ అయిన డిప్యూటీ సీఎం నువ్వే – రాజయ్యకు కడియం కౌంటర్‌

-

దేశ చరిత్రలో బర్తరఫ్‌ అయిన డిప్యూటీ సీఎం నువ్వే అంటూ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య ఆరోపణలకు ఎమ్మెల్సీ కడియం కౌంటర్ ఇచ్చారు. పెన్షన్ పంపీణీ కార్యక్రమంలో మాట్లాడిన రాజయ్య ఆ వేదికను దుర్వినియోగం చేశారని.. రాజయ్య తీవ్రమైన నిరాశ,నిస్పృహలో ఉన్నారన్నారు. ప్రజల మద్దతును ఎమ్మెల్యే రాజయ్య కోల్పోతున్నారని.. మతిస్థిమితం లేనట్లుగా ఎమ్మెల్యే రాజయ్య కోల్పోతున్నారని చెప్పారు.

ఆ కామెంట్స్ ని బేషరుతుగా వెనక్కి తీసుకోవాలి.. నీ కంటే ముందు మూడుసార్లు ప్రాతినిధ్యం వహించిన.. నాపై తీవ్ర ఆరోపణలు చేస్తావా? అని ఫైర్‌ అయ్యారు. ఎమ్మెల్యే రాజయ్యకు ఎదైనా సమస్య ఉంటే అధిష్టానానికి చెప్పుకోవాలని.. ఎమ్మెల్యే రాజయ్య విజయం కోసం మేం కష్టపడ్డామన్నారు ఎమ్మెల్సీ కడియం శ్రీహరి.

స్టేషన్ ఘన్పూర్ ఎవరి అడ్డా,జాగీరు కాదు.. నాలుగు సార్లు గెలిచి ఏం చేశావని పేర్కొన్నారు. రాజకీయాలలో ఉన్నప్పుడు ఓళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి.. భారతదేశంలో ఉపముఖ్యమంత్రిగా భర్తరఫ్ అయిన మొదటి వ్యక్తి నువ్వే అని తెలిపారు.
భర్తరఫ్ అయినప్పుడు స్టేషన్ ఘన్పూర్ పరుపు పోలేదా?..నిన్ను ఎన్నుకున్న ప్రజల గౌరవం పోలేదా? అని నిలదీశారు ఎమ్మెల్సీ కడియం శ్రీహరి.

Read more RELATED
Recommended to you

Latest news