కడియం శ్రీహరి పై రాజయ్య సంచలన వ్యాఖ్యలు

-

వరంగల్‌ జిల్లా టీఆర్ఎస్‌ పార్టీలో ముసలం నెలకొంది. మరోసారి టీఆర్ఎస్‌ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య వర్సెస్‌… కడియం శ్రీహరి మధ్య వివాదం తెరపైకి వచ్చింది. తాజాగా కడియం శ్రీహరి పై టీఆర్ఎస్‌ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. కడియం శ్రీహరి మంత్రిగా ఉన్న సమయంలోనే నక్సలైట్ల హత్యలు, 361 మంది నక్సలైట్లను పొట్టనపెట్టుకున్నారని ఫైర్‌ అయ్యారు ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య.

ప్రస్తుతం ఆర్ఎస్‌ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో హాట్‌ టాపిక్‌ గా మారాయి. అయితే.. దీనిపై కడియం శ్రీహరి స్పందించారు. ప్రజల మద్దతును రాజయ్య కోల్పోతున్నారు.. ఘన్‌పూర్‌ ఎవరి అడ్డా కాదు.. రాజయ్య విజయం కోసం మేం కష్టపడ్డాం.. 4 సార్లు గెలిచి ఘన్‌పూర్‌కు ఏం చేశావు? రాజయ్యకు ఏదైనా సమస్య ఉంటే అధిష్టానికి చెప్పుకోవాలి.. రాజయ్య.. తన వ్యాఖ్యలను బేషరుతుగా వెనక్కి తీసుకోవాలని చురకలు అంటించారు కడియం శ్రీహరి.

Read more RELATED
Recommended to you

Latest news