కేసీఆర్‌.. తెలంగాణ బాహుబలి..మీరు మతోన్మాదులు ; బీజేపీపై కడియం ఫైర్‌

-

సీఎం కేసీఆర్‌.. తెలంగాణ బాహుబలి అని..బీజేపీ నాయకులంతా మతోన్మాదులు అని ఎమ్మెల్సీ కడియం శ్రీహరి ఫైర్‌ అయ్యారు. నిన్నటి బీజేపీ సభలో నాయకుల మాటలకు ఎమ్మెల్సీ కడియం శ్రీహరి కౌంటర్ ఇచ్చారు. వరంగల్ లో సభ పెట్టే అర్హత బీజేపీకి లేదని.. మేడారం జాతరకు జాతీయ హోదా తీసుకురాలేని చవటలు బీజేపీ నాయకులు అని ఆగ్రహించారు. గిరిజన యూనివర్సిటీ, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ , కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏమైంది..? బీజేపీ తెలంగాణకు చేసిన అభివృద్ధి ఏంటీ..? అని నిలదీశారు.

బిడ్డా సంజయ్.. ఇది ఉద్యమాల గడ్డా, టీఆర్ఎస్ గడ్డా, ఖబడ్దార్..? అని వార్నింగ్‌ ఇచ్చారు. కేసీఆర్ ను విమర్శించే అర్హత సంజయ్ కు లేదని.. మధ్యప్రదేశ్, అస్సాం సీఎంలకు మతి ఉందా..? అని ప్రశ్నించారు. అభివృద్ధి సూచీలో మీరెక్కడున్నారో తెలుసా..? మోదీ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని భ్రష్టు పట్టిస్తోంది, ఇది ప్రమాదకకరమని మండిపడ్డారు.

మతోన్మాదులకు తెలంగాణలో చోటు లేదని.. అభివృద్ధిని ఓర్వలేకనే రాష్ట్రంపై బీజేపీ దాడి చేస్తోందని ఆగ్రహించారు. బీజేపీ సీఎంలు, మంత్రులు, నాయకులు సీఎం కేసీఆర్ పై ఇష్టం వచ్చినట్లు మాట్లాడటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని… గతంలో తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధిని మెచ్చుకున్న వారే ఇప్పుడు దూషిస్తున్నారన్నారు. బీజేపీ నాయకులు పగటివేషగాళ్లలా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news