సైబర్ క్రైమ్‌కు ఫిర్యాదు చేసిన కరాటే కల్యాణి.. ఎందుకంటే..?

-

హిందువుల మనోభావాలను దెబ్బ తీసేలా కొందరు వ్యక్తులు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారని, వారిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని క్యారెక్టర్ ఆర్టిస్ట్ కరాటే కల్యాణి డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. శివలింగంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు.

కరాటే కల్యాణి
కరాటే కల్యాణి

ఈ సందర్భంగా కరాటే కల్యాణి మాట్లాడుతూ.. గత కొంత కాలంగా సయ్యద్ షరీఫ్ ఉద్దీన్ అనే వ్యక్తి సోషల్ మీడియాలో హిందూ దైవమైన శివలింగంపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నాడని పేర్కొన్నారు. 100 కోట్ల హిందూ దైవాన్ని కించపరిచేలా ఆయన వ్యాఖ్యలు చేస్తున్నా.. పోలీసులు పట్టించుకోవడం లేదన్నారు. బీజేపీ నాయకురాలు నుపుర్ శర్మ వ్యవహారంలో అనేక కేసులు నమోదు చేసిన పోలీసులు.. మతాలను రెచ్చగొడుతూ పోస్టులు చేస్తున్న వ్యక్తిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. పోలీసులు వెంటనే కేసు నమోదు చేసుకుని సయ్యద్ షరీఫ్ ఉద్దీన్‌పై చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news