BREAKING : కార్తికేయ 2 మూవీ రిలీజ్ కు మళ్లీ బ్రేక్ ?

-

చందూ మొండేటి దర్శకత్వంలో యంగ్‌ హీరో నిఖిల్‌ సిద్ధార్థ కథనాయకుడిగా వచ్చిన సినిమా కార్తికేయ. ఈ సినిమా ఊహించని బ్లాక్‌ బాస్టర్‌ హిట్‌ను సొంతం చేసుకుంది. దీంతో ఈ సినిమాకు సీక్వెల్‌ చేసేందుకు శ్రీకారం చుట్టారు. ఈనేపథ్యంలో నిఖిల్‌ హీరోగా, అనుపమ పరమేశ్వర్‌ జంటగా కార్తికేయ-2 సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమాను పాన్‌ ఇండియా వైడ్‌గా రిలీజ్‌ చేస్తున్నారు.

ఇక ఇప్పటికే విడుదల చేసిన అప్డేట్స్‌.. సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. అయితే.. జూలై 22వ తేదీన విడుదల కావాల్సి ఉంది. కానీ ఆ తేదీని వాయిదా వేసుకుంది చిత్ర బృందం. ఇటీవలే కొత్త విడుదల తేదీని కూడా ప్రకటించింది చిత్ర బృందం. ఆగస్టు 12వ తేదీన ఈ సినిమాను విడుదల చేస్తున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. ఈ మేరకు ఓ పోస్టర్‌ కూడా విడుదల చేసింది. అయితే తాజాగా ఆగస్టు 12వ తేదీన కాకుండా ఒక రోజు వెనుకకు అంటే ఆగస్టు 13వ తేదీన ఈ మూవీని రిలీజ్ చేయాలని ఆలోచన చేస్తోందట కార్తికేయ -2 టిం. దీనిపై ఇవాళ ప్రెస్ మీట్ పెట్టి మరీ, ప్రకటన చేయనున్నట్లు సమాచారం అందుతోంది. మరి ఈ విషయం ఎంత వరకు వాస్తవమో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news