‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ చిత్రానికి చిరంజీవి తీసుకున్న పారితోషికం అంతనా?

-

చిరంజీవి నటించిన సినిమాల్లో అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే చక్కటి చిత్రం ‘జగదేక వీరుడు అతి లోక సుందరి’ అని చెప్పొచ్చు. పిల్లల నుంచి వృద్ధుల వరకు ప్రతీ ఒక్కరు ఈ మూవీని ఆనందంగా చూసేస్తుంటారు. టీవీల్లో వచ్చినా చూసేందుకు రెడీ అయిపోతుంటారు. ఇక ఈ ఫిల్మ్ లో శ్రీదేవి – చిరంజీవిల స్టెప్పులు చూసి అయితే జనాలు ఫిదా అయిపోతారు.

దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు ప్రొడ్యూస్ చేసిన ఈ భారీ బడ్జెట్ ఫిల్మ్..రికార్డులను సృష్టించింది. ఇళయరాజా సంగీతం అందించగా, చిరంజీవి-శ్రీదేవిల గ్రేస్ ఫుల్ స్టెప్స్ చూసి జనాలు వావ్ అన్నారు. అశ్వినీదత్ ఈ మూవీని ప్రొడ్యూస్ చేయగా, సినిమా విడుదల సమయంలో తుఫాన్ వచ్చింది. అయినప్పటికీ చిత్రం చూసేందుకు జనాలు థియేటర్ల వద్దకు వచ్చేసి..సినిమాను విజయం వైపునకు నడిపించారు.

ఇక ఈ చిత్రానికి అయిన బడ్జెట్ గురించి అప్పట్లో ఫిల్మ్ నగర్ సర్కి్ల్స్ లో డిస్కషన్ జరిగేది. కాగా, ఈ
మూవీ తీసిన శాటిస్ ఫాక్షన్ తనకుందని ఓ ఇంటర్వ్యూలో నిర్మాత అశ్వినీదత్ చెప్పారు. ఇకపోతే ఈ చిత్రంలో నటించినందుకుగాను చిరంజీవికి రూ.35 లక్షలు, శ్రీదేవికి రూ.25 లక్షలు రెమ్యునరేషన్ ఇచ్చారట. అప్పట్లో ఆ రెమ్యునరేషన్ చాలా ఎక్కువ కాగా ఇప్పుడు అది చాలా తక్కువ.

‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ చిత్రం ఇండస్ట్రీ హిట్ గా నిలివడమే కాదు. ప్రతీ ఒక్కరి ఫేవరెట్ పిక్చర్ గా నిలిచిపోయింది. ఇక ఇందులో పిల్లలతో చిరంజీవి ఇంటారక్షన్, ఫైట్ సీక్వెన్సెస్…అందాల తార శ్రీదేవి అభినయం..అన్నీ హైలైట్ గా నిలిచాయి. ఈ సినిమా సీక్వెల్ తీయాలని చిరంజీవి ఓ ఇంటర్వ్యూలో అన్నారు. చూడాలి మరి..ఎప్పుడు ఈ పిక్చర్ కు సీక్వెల్ వస్తుందో..

Read more RELATED
Recommended to you

Latest news