కస్తూరి అంటే ఫ్లవర్ అనుకున్నారా! కాదు ఫైర్ బ్రాండ్.!

-

నటి కస్తూరి అంటే చాలా మందికి తెలియదు కాని మాటీవి లో వచ్చే  గృహలక్ష్మి సీరియల్ వచ్చే తులసి అంటే చాలు ఇట్టే గుర్తుపడతారు. కాని ప్రస్తుతం నయనతార ఇష్యూ లో వేలు పెట్టి సోషల్ మీడియాలో  టాక్ ఆఫ్ ద టౌన్ అయింది. ఈమె నిజజీవితంలో ఒక ప్రశ్నించే గొంతులాగా వుంటుంది.ఎవరైనా  తప్పు మాట్లాడిన , తప్పుడు పనులు చేసినా వెంటనే రంగంలోకి దిగి చెడుగుడు ఆడేస్తుంది. ప్రతి చిన్న విషయంలో నేను వున్నా అంటూ  ప్రతి విషయంలో టార్గెట్ గా  మారింది. 

తమిళంలో ఎంత పెద్ద స్టార్ అయినా కూడా ఆమె కేర్ చేయదు.దేనికి భయపడకుండా తాను అనుకున్నది చేస్తూ వుంటుంది. ప్రస్తుతం నయనతారపై  సరొగసి ద్వారా పిల్లలను కనటంపై సంచలన కామెంట్స్ చేసి తమిళనాడులో హాట్ టాపిక్ గా మారింది. ఇదొక్కటే కాదు  ఇంతకుముందే ఈమె ఎన్నో వివాదాలలో తల దూర్చింది. ఆ వివాదాలలో కొన్నింటి గురించి తెలుసుకుందాం .గతంలో రజినీకాంత్ పై రాజకీయం పనికిరారు అని ఒక ఇష్యూలో,  రాజీవ్ గాంధీ హంతకులపై ఎలాంటి స్టాండ్ తీసుకోవడం లేదని రెండుసార్లు విమర్శలు చేసి రజిని అభిమానుల ఆగ్రహానికి గురైంది. అలాగే ఒక హీరో సినిమాల్లో నటిస్తున్న సమయంలో తనని కమిట్ మెంట్ అడిగి ఇబ్బంది పెట్టాడు అంటూ గోలగోల చేసింది.

అలాగే తమిళంలో పెద్ద దర్శకులు అయిన భారతి రాజా మరియు శంకర్ లను సౌత్ ఇండియా హీరోయిన్లు లను తీసుకోకుండా బాలీవుడ్ నుండి  హీరోయిన్ల ను తెస్తున్నారని విరుచుకుపడింది. దీనితో  మరోసారి తమిళనాడులో శంకర్ అభిమానులు సోషల్ మీడియాలో ఆమె మీద దాడి చేశారు. మరోసారి ఎవరో ఏదో అన్నారని  ఆమె అజిత్ అభిమానులపై డర్టీ అజిత్ ఫ్యాన్స్ అనే హ్యాష్ టాగ్  పెట్టి  సోషల్ మీడియాలో వైరల్ అయ్యేలా చేసింది.దానితో  అది దేశవ్యాప్తంగా ట్రెండింగ్ గా కూడా మారింది. ఇప్పుడు తమిళనాడులో కస్తూరి ఏ విషయంలో దొరుకుతుందా అని అందరూ వెయిట్ చేస్తున్నారు. ఇప్పుడు మళ్లీ నయనతార విషయం లో కామెంట్స్ చేసి సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ గా మారింది.

Read more RELATED
Recommended to you

Latest news