Breaking : ఏపీలో ముగ్గురు ఐపీఎస్‌ అధికారుల బదిలీ

-

ఏపీలో ముగ్గురు సీనియ‌ర్ ఐపీఎస్ అధికారులు బ‌దిలీ అయ్యారు. ఈ మేర‌కు బుధ‌వారం రాష్ట్ర ప్ర‌భుత్వం అధికారికంగా ఉత్త‌ర్వులు జారీ చేసింది. పోలీస్ హౌసింగ్ కార్పొరేష‌న్ ఎండీగా కొన‌సాగుతున్న సంజ‌య్‌ ఏపీ విప‌త్తుల నిర్వ‌హ‌ణ శాఖ డీజీగా నియ‌మితుల‌య్యారు. సంజ‌య్ బ‌దిలీతో ఖాళీ అయిన పోలీస్ హౌసింగ్ కార్పొరేష‌న్ ఎండీగా పి.వెంక‌ట్రామిరెడ్డి నియ‌మితుల‌య్యారు. ఇక మ‌రో సీనియ‌ర్ ఐపీఎస్ అధికారి మాదిరెడ్డి ప్ర‌తాప్‌ను సాధార‌ణ ప‌రిపాల‌న శాఖ (జీఏడీ)లో రిపోర్ట్ చేయాల‌ని రాష్ట్ర ప్ర‌భుత్వం ఆదేశాలు జారీ చేసింది.

AP govt cuts short Chandrababu Naidu's security cover

ఇదిలా ఉంటే.. అక్టోబర్‌ 1న సెర్ప్‌ సీఈవోగా ఎం. గౌతమిని నియమించారు. భూపరిపాలన శాఖ అదనపు చీఫ్‌ కమిషనర్‌గా ఉన్న ఇంతియాజ్‌కు మైనారిటీ సంక్షేమ శాఖ కార్యదర్శిగా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు. ప్రసుత్తం అమూల్‌ ప్రాజెక్టు ప్రత్యేక అధికారిగా పనిచేస్తున్న బాబును ఏపీ డెయిరీ డెవలప్‌మెంట్‌ కోఆపరేటివ్‌ ఫెడరేషన్‌ ఎండీగా నియమించారు.

 

 

Read more RELATED
Recommended to you

Latest news