అప్పుడే అతడు నావాడు అనిపించింది.. కత్రినా ఇంట్రెస్టింగ్ కామెంట్స్​

-

బాలీవుడ్‌ ముద్దుగుమ్మ కత్రినాకైఫ్‌ విక్కీతో తన రిలేషన్‌షిప్‌ ఎలా మొదలైందో కాఫీ విత్‌ కరణ్‌ షోలో వివరించారు. జోయా అక్తర్‌ ఇంట జరిగిన పార్టీలో తాను మొదటిసారి అతడిని కలిశానని చెప్పుకొచ్చారు.

”విక్కీకౌశల్‌ని, నన్ను విధి కలిపింది. ఎందుకంటే విక్కీతో ప్రేమలో పడటానికంటే ముందు అతడి గురించి నాకేమీ తెలియదు. కేవలం పేరు మాత్రమే తెలుసు. జోయా అక్తర్‌ పార్టీలో అతడిని మొదటిసారి కలిసి మాట్లాడా. అతడు నావాడే అనిపించింది. మా మధ్య చాలా యాదృచ్ఛిక ఘటనలు ఉన్నాయి.. ఓ సమయంలో అవన్నీ అవాస్తవంగా కూడా అనిపించాయి. తర్వాత మేమిద్దరం కొంతకాలం డేటింగ్‌లో ఉన్నాం. విక్కీ తన ఫ్యామిలీకి ఎంతో గౌరవమిస్తాడు. నా ఫ్యామిలీని కూడా అంతే బాగా చూసుకుంటాడు”

”పెళ్లైన తర్వాత నా మొదటి పుట్టినరోజుని మాల్దీవుల్లో జరుపుకొన్నాం. ఆ సమయంలో నేను కొవిడ్‌ నుంచి అప్పుడే కోలుకుని నీరసంగా ఉన్నా. నా పరిస్థితి అర్థం చేసుకున్న విక్కీ.. సుమారు 45 నిమిషాలపాటు నా సినిమా పాటలన్నింటికీ డ్యాన్స్‌ చేశాడు. విక్కీతో కలిసి డ్యాన్స్‌ చేయలేక అందరూ సైలెంట్‌గా కూర్చొని చూస్తూ ఉండిపోయారు. విక్కీ ఫర్ఫెక్ట్‌గా డ్యాన్స్‌ చేశాడని చెప్పను కానీ, చేసినంత సేపు నన్ను నవ్వించడానికి ప్రయత్నించాడు’’ అని కత్రినా చెప్పుకొచ్చారు.

అనంతరం ఆమె నటి ఇలియానా తన సోదరుడు రిలేషన్‌లో ఉన్నారంటూ జరుగుతోన్న ప్రచారంపై స్పందించారు. ”ఇలియానా నా బర్త్‌డే పార్టీలో పాల్గొన్న ఫొటోలు కొన్ని బయటకు వచ్చాయి. వాటిని చూశాక నాక్కూడా చాలా సందేహలు వచ్చాయి. మొదటిసారి కలిసి ఓ పార్టీలో పాల్గొన్నారు. ‘వీళ్లిద్దరూ ఎలా కలిశారు? అనిపించింది. అయితే, వీళ్లిద్దరూ రిలేషన్‌లో ఉన్నారని చెప్పుకోవడానికి లేదు” అని బదులిచ్చారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version