ఓటీటీ లో క‌త్రిన, కౌశ‌ల్ వివాహ సంద‌డి

-

బాలీవుడ్ ప్రేమ జంట క‌త్రినా కైఫ్, విక్కీ కౌశ‌ల్ పెళ్లి ఈ నెల 9న రాజ‌స్థాన్ లో ని సిక్స్ సెన్సెస్ ఫోర్ట్ బ‌ర్వారా లో జ‌ర‌గ‌నుంది. అయితే కరోనా వ్యాప్తి, ఓమిక్రాన్ వేరియంట్ ప్ర‌భావం తో కొద్ధి మంది అతిథుల మ‌ధ్య ఈ వివాహ వేడుక జ‌ర‌గ‌నుంది. అయితే ఈ వివాహ సంద‌డి ని ప్రపంచ వ్యాప్తం గా ఉన్న‌తమ అభిమానులు చూడాల‌ని ప్లాన్ వేశారు ఈ బాలీవుడ్ జంట‌. అందు కోసం త‌మ వివాహ వేడుకను ఓటీటీ లో ప్ర‌సారం చేయాల‌ని భావించారు. దాని కోసం ఒక ప్ర‌ముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ తో ఒప్పందం కూడా చేసుకున్నార‌ని తెలుస్తుంది.

ఆ ఓటీటీ ప్లాట్ ఫామ్ కూడా క‌త్రినా కైఫ్, విక్కి కౌశ‌ల్ వివాహ వేడుక కు భారీగా ఆఫ‌ర్ చేసిందని తెలుస్తుంది. దీంతో వీరు ఓటీటీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన‌ట్టు స‌మాచారం. అయితే దీని లో క‌త్రినా కైఫ్, విక్కి కౌశ‌ల్ వివాహ వేడుక తో పాటు వారి ఇంట‌ర్వ్యూ కూడా ఉంటుంద‌ని తెలుస్తుంది. అలాగే పెళ్లి కి వ‌చ్చినా.. అతిథుల అభిప్రాయాల ను కూడా షూట్ చేయ‌నున్నార‌ని తెలుస్తుంది. అయితే ఈ పెళ్లి స‌మయం లో ఒక్క ఫోటో గానీ, వీడియో గాని బ‌య‌ట‌కు రాకుండా జాగ్ర‌త్త ప‌డుతున్నార‌ట‌. పెళ్లి కి వ‌చ్చే అతిథుల కు కూడా సెల్ ఫోన్ లు అనుమ‌తి లేద‌ని.. తీసుకురావ‌ద్ద‌ని విజ్ఞాప్తి చేశారు. కాగ క‌త్రినా, కౌశ‌ల్ వివాహం డైరెక్ట్ గా కాకున్న ఓటీటీలో అయినా చూస్తున్నామ‌ని ప‌లువురు అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news