YCPకి షాక్‌..ఏపీలో కల్వకుంట్ల కవిత ప్రచారం..!

-

బీఆర్‌ఎస్‌ పార్టీ ప్రస్తుతం దేశ వ్యాప్తంగా విస్తరించాలని యోచిస్తోంది. ఈ నేపథ్యంలోనే మొదటగా ఏపీపై ఫోకస్ చేసింది బీఆర్‌ఎస్‌. ఇందులో భాగంగానే,  సీఎం కేసీఆర్ కుమార్తె ఎమ్మెల్సీ కవిత త్వరలో ఏపీలో పర్యటించనున్నారు. ఈ విషయాన్ని ఆమె స్వయంగా ప్రకటించారు. ఏపీ బీఆర్ఎస్ నేతలు తాజాగా ఎమ్మెల్సీ కవితను కలిశారు. ఏపీ బీఆర్ఎస్ అధ్యక్షులు చంద్రశేఖర్, రావెల కిషోర్ బాబు, పార్థసారథిలతో హైదరాబాద్ లోని తన నివాసంలో కవిత భేటీ అయ్యారు.

ఈ సందర్భంగా ఏపీలో బీఆర్ఎస్ విస్తరణ తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారు. ఏపీలో బీఆర్ఎస్ కార్యాలయం ప్రారంభం, సభ నిర్వహణపై నేతలతో కవిత చర్చించారు. విజయవాడ లేదా గుంటూరులో భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు బీఆర్ఎస్ సమాలోచనలు చేస్తోంది. ఈ సభ పై ఏపీ బీఆర్ఎస్ నేతలతో కవిత చర్చించారు.

Read more RELATED
Recommended to you

Latest news